దేశంలో మీడియా కమిషన్ ఏర్పాటుకు స్వాగతిస్తాం
భారతీయ జర్నలిస్టు ధ్రువతార మానికొండ చలపతిరావు
మహిళలకు చీరలు… పిల్లలకు బహుమతులు
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు… పంచాంగ శ్రవణం
జర్నలిస్టుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం మీడియా కమిషన్ ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకరించడం పట్ల ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఇక్కడ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఏపీ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్, ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో విశ్వావసు ఉగాది నామ సంవత్సర. వేడుకలు అందరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంజనేయులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయని,అలాగే అనేక ప్రాంతాల్లో హత్యలు జరుగుతున్నాయని ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు మీడియా కమిషన్ ఎంత గానో తోడ్పాటు అందిస్తుందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ద్వారా జర్నలిస్టులు సమస్యలు పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. గౌరవ అతిథులుగా హాజరైన ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ డీకే బారువ, ఎసిఎ మీడియా మేనేజర్జై కిషన్, ప్రముఖ సంఘ సేవకులు మట్టపల్లి హనుమంతరావు, శంకర్ ఫౌండేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ బంగార్రాజు తదితరులు మాట్లాడుతూ. సమాజానికి జర్నలిస్టులు అందిస్తున్న సేవలు ఎంతో ప్రశంసనీయమన్నారు. అలాగే క్రమం తప్పకుండా జర్నలిస్ట్ లు ఉగాదితో పాటు అనేక పండుగలు కూడా నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా తమ యూనియన్లు సేవలు అందిస్తున్నాయన్నారు. తమ పరిధి మేరకు. జర్నలిస్టులకు సహాయం అందిస్తున్నామని, అందరు బాగుండాలి అన్నదే తమ లక్ష్యం అన్నారు. ఈ సందర్బంగా ప్రముఖ పండితులు బ్రహ్మశ్రీ బులుసు సాయికృష్ణ శర్మ నిర్వహించిన పంచాంగ శ్రవణములో ఆదాయం, వ్యయాలు ఆరోగ్యం, పంటలు వంటి అంశాలు విపులంగా వివరించారు. పలువురు జర్నలిస్ట్ ల పిల్లలు ప్రదర్శించిన సాంసృతిక కార్యక్రమాలు విశేషం గా అలరించాయి. మహిళలు కు చీరలు, పిల్లలకు బహుమతులు, పంచాంగం పుస్తకాలు పంపిణీ చేసారు. ఈ ఉగాది సంబరాలలో విశాఖ జిల్లా కార్యదర్శి పి.నారాయణ, కార్యదర్శి జి. శ్రీనివాస్ రావు, బ్రాడ్ కాస్ట్ కార్యదర్శి కె. మదన్, చిన్న, మధ్య తరహో పత్రికల సంఘం అధ్యక్షులు జగన్ మోహన్, కె. శ్రీనివాస్, ఫెడరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ లు డి. రవి కుమార్, ఎ. సాంబ శివరావు, గొడబ రాంబాబు, బండారు శివ ప్రసాద్, ఎంవీ రాజశేఖర్ తో పాటు వందలాది మంది జర్నలిస్ట్ లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
జర్నలిస్ట్ ధ్రువతార మానికొండ
భారతీయ జర్నలిజములో మానికొండ చలపతి రావు ధ్రువతారగా నిలిచారని ఆంధ్ర యూనివర్సిటీ ఆచార్యులు బాబీ వర్ధన్ కొనియాడారు. సీనియర్ పాత్రికేయులు ఆకుల అమరయ్య రచించిన మాని కొండ చలపతిరావు పుస్తకం ను ఆచార్య బాబీ వర్ధన్, జర్నలిస్ట్ నాయకులు జి.ఆంజనేయులు, కొండ బాబు, రంగా రెడ్డి, గంట్ల శ్రీను బాబు, పి. నారాయణ తదితరులు చేతులు మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా బాబీ వర్ధన్ మానికొండ గొప్ప తనము, జర్నలిస్ట్ గా ఆయన సాధించిన అద్భుతాలు, నిరాడంబర జీవితం, ఇతర విశేషాలు వివరించారు. ఈ పుస్తక రచన చేయడం తన అదృష్టం అని అమరయ్య పేర్కొన్నారు. ఉత్తరాంద్ర ప్రాంతం కు చెందిన మాని కొండ చలపతి రావు జీవితం భవిష్యత్ తరాలకు ఆదర్శం అన్నారు. నాటి ప్రధాని నెహ్రు, ఇందిరా గాంధీ వంటి వారు సైతం మాని కొండ వార్తలు, రచనలుతో పాటు జర్నలిజమును నిటారుగా నిలబెట్టిన వ్యక్తిగా అభివర్ణించారని అమరయ్య తన ప్రసంగంలో పేర్కొన్నారు.