ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి కార్యవర్గ సభ్యులు, ఉండ్రాజవరం గ్రామం మాజీ సర్పంచ్ బూరుగుపల్లి చిన్నారావు వర్ధంతి సందర్భంగా సోమవారం ఉండ్రాజవరం గ్రామంలో ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు, కార్యకర్తలు. సీనియర్ కాంగ్రెస్ నాయకునిగా ఉండ్రాజవరం గ్రామ సర్పంచ్ పదవిలో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించి, నిస్వార్ధ నాయకుడిగా ఖ్యాతి గడించిన బూరుగుపల్లి చిన్నారావు వర్ధంతి సందర్భంగా నిడదవోలు నియోజకవర్గ వైసిపి నాయకులు బూరుగుపల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో ఘన నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివాలయం వద్ద గ్రామపంచాయతీ వద్ద గల చిన్నారావు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు బూరుగుపల్లి సుబ్బారావు మాట్లాడుతూ ఆయన ఆశయాల కొరకు ప్రజాశ్రేయస్సు కొరకు అహర్నిశలు వైఎస్ఆర్సిపి కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు గ్రామ సర్పంచ్ మెండే వెంకట్రావు, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలు గాడి కృష్టఫర్, రామకృష్ణ, వార్డు మెంబర్లు, గ్రామ వైసిపి నాయకులు కరటూరి కాశీ, నిమ్మన శ్రీనివాస్, దోనేపూడి సుధాకర్, మారిశెట్టి నాగేశ్వరరావు, దువ్వాపు సత్యనారాయణ, మాజేటి ఆనంద్, మట్ట సూర్యప్రకాష్ మండల వైసీపీ నాయకులు పాలాటి శరత్ బాబు, గంధం మునేశ్వరరావు, దొడ్డ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
