గత ప్రభుత్వ హయాంలో క్రీడల పేరుతో రూ. కోట్లు దోపిడి
తణుకులో క్రీడల పేరుతో పార్కుల అభివృద్ధికి శ్రీకారం
వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
తణుకులో ముగిసిన బాస్కెట్ బాల్ టోర్నమెంట్ పోటీలు
రాబోయే రోజుల్లో తణుకు నియోజకవర్గం క్రీడల నిర్వహణకు వేదికగా నిలిపేందుకు తన వంతు సహకారం అందిస్తానని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రంలో క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. తణుకు బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన ఎమ్మెల్యే బాస్కెట్ బాల్ టోర్నమెంట్ మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహుమతి ప్రధానోత్సవంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. గతంలో క్రీడాకారులు ఎన్ని పతకాలు సాధించినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి నానా అవస్థలు పడేవారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో దేశ విదేశాల్లో ఎక్కడ పథకాలు సాధించినప్పటికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో ప్రాధాన్యత ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో క్రీడలకు అత్యంత ప్రధాని అయితే ఇచ్చి బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్ర అంటూ క్రీడల పేరుతో రూ. వందల కోట్లు దోచేశారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. తణుకు పురపాలక సంఘం ఆధ్వర్యంలో క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి కృషి చేయనున్నట్లు తెలిపారు. క్రీడల్లో ఒక్కొక్క క్రీడను తీయంగా తీసుకొని పార్కులను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని టోర్నమెంట్లో నిర్వహించడానికి నాందిగా తణుకు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే బాస్కెట్ బాల్ టోర్నమెంట్ నిలుస్తుందని అన్నారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా క్రీడలు శరీరధారుఢ్యానికి దోహదం చేస్తాయని చెప్పారు. క్రీడల పట్ల ప్రతి ఒక్కరికి ఆసక్తి పెరిగే విధంగా ముఖ్యంగా యువతను ప్రోత్సహించి అనేక టోర్నమెంట్లు నిర్వహించడానికి తణుకు నియోజవర్గంలో కృషి చేస్తున్నట్లు చెప్పారు. జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ త్వరలో ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. డ్రగ్స్, ఇతరత్రా మత్తు పదార్థాల నుంచి యువతను దృష్టి మళ్లించేందుకు వారికి క్రీడలపై ఆసక్తి కలిగించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా అనేక చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. వేసవి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి తణుకు బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే ఆర్థిక సహకారంతో మొదటి స్థానంలో నిలిచిన విజేతకు రూ.15 వేలు, రెండో స్థానంలో నిలిచిన విజేతకు రూ. 10 వేలు, మూడో స్థానంలో నిలిచిన విజేతకు రూ.7 వేలతో పాటు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రూ. 3 వేలు నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.