21 మంది లబ్ధిదారులకు రూ. 12.11 లక్షలు అందజేత
9 నెలల్లో నియోజకవర్గంలో రూ. 3 కోట్లు ఆర్థిక సాయం
ఇకపై ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షలతో బీమా సదుపాయం – తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారా వైద్య సదుపాయం పొందలేక సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న వారికి ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం సహాయ నిధి ద్వారా ఆదుకుంటున్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం తణుకు నియోజకవర్గంలో 21 మంది లబ్ధిదారులకు రూ. 12.11 లక్షల ఆర్థిక సహాయాన్ని స్థానిక కూటమి కార్యాలయంలో మంగళవారం చెక్కుల రూపంలో అందజేసి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తణుకు నియోజకవర్గంలోని బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సుమారు రూ. కోట్లు చెల్లించినట్లు చెప్పారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా పేద, దిగువ మధ్యతరగతి వర్గాలను ఆదుకునే విధంగా వారిని అన్ని విధాలుగా ఆర్థికంగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటుందని అన్నారు.రాబోయే రోజుల్లో ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల మేర బీమా సదుపాయం కల్పించి దాని ద్వారా వైద్య సదుపాయం పొందే విధంగా బడ్జెట్ లో నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించి రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక పథకాలను తీసుకువచ్చి ప్రతి ఒక్కరిని ఆదుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. పేద ప్రజల సంక్షేమం కోసం కూటమి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే రాధాకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.