నడక కోల్పోయిన 35 ఏళ్ల మహిళ – నరాల వ్యాధికి విజయవంతమైన శస్త్ర చికిత్స!
నడకశక్తి కోల్పోయిన 35 ఏళ్ల మహిళ జీవితంలో మళ్లీ వెలుగులు నింపిన కేర్ వైద్యులు!
అరుదైన నర సంబంధ వ్యాధి వల్ల పూర్తిగా కాళ్ళు సచ్చు పడిపోయిన 35 ఏళ్ల మహిళను తిరిగి నడవగలిగే స్థితికి తీసుకురావడంలో విశాఖపట్నంలోని కేర్ హాస్పిటల్స్ వైద్యులు అద్భుతమైన విజయాన్ని సాధించారు. రాధారాణి అనే మహిళకు న్యూరోమైలిటిస్ ఆప్టికా స్పెక్ట్రం డిసార్డర్ ( ఎన్ఎంఓఎస్డి) అనే అరుదైన వ్యాధిగా గుర్తించారు. ఈ వ్యాధి కారణంగా ఆమె వెన్నులో తీవ్రమైన వాపు ఏర్పడి, కాళ్లలో చలనం మరియు స్పర్శ పూర్తిగా పోయాయి. ఆమెను ఆసుపత్రికి తీసుకువచ్చిన సమయంలో, కడుపు నుండి కాళ్ల వరకు స్పర్శ లేకుండా, పూర్తిగా పడకపై ఉండే స్థితిలో ఉన్నారు. మెదడు మరియు వెన్నుకు సంబంధించి తీసిన ఎంఆర్ఐ స్కాన్లో, మెడ కింద నుండి మధ్య వెన్నుకి వరకు తీవ్ర వాపు గుర్తించబడింది. ప్రాథమిక రక్తపరీక్షల్లో వ్యాధికి సంబంధించి స్పష్టమైన లక్షణాలు కనిపించకపోయినా, వైద్యులు చికిత్సలో జాప్యం చేయకుండా వెంటనే ప్రత్యేక చికిత్స ప్రారంభించారు. మొదట ఆమెకు ఐదు రోజుల పాటు ఐవి ద్వారా మందులు అందించారు. ఆ తర్వాత ప్లాస్మా ఎక్స్చేంజ్ అనే శరీర రక్షక వ్యవస్థను శుద్ధి చేసే చికిత్సను పలు విడతలుగా అందించారు. మెరుగుదల కనిపించడంతో, మోనోక్లోనల్ యాంటీబాడీ ఆధారిత చికిత్సను అమలు చేశారు. నెల రోజుల వ్యవధిలో రాధారాణికి కాళ్లలో బలం, స్పర్శ తిరిగి వచ్చాయి. ఆమె తిరిగి నడవడం ప్రారంభించి, సాధారణ జీవితం వైపు అడుగులు వేస్తున్నారు.ఈ సందర్భంగా కేర్ హాస్పిటల్స్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎం.జి.వి. ఆదిత్య మాట్లాడుతూ, “లాంగిట్యూడినల్ ఎక్స్టెండింగ్ ట్రాన్స్ వర్స్ మైలైటిస్ ( యల్ఈటీ యమ్) తో కూడిన న్యూరోమైలిటిస్ ఆప్టికా స్పెక్ట్రం డిసార్డర్ అనేది లక్ష మందిలో ఒకరికి మాత్రమే వచ్చే అరుదైన వ్యాధి. రాధారాణి విషయంలో, గమనించిన వెంటనే ఇచ్చిన ఇమ్యూనోథెరపీ చికిత్స వల్ల ఆమె పూర్తి ఆరోగ్యాన్ని తిరిగి పొందగలిగారు” అని తెలిపారు.ఈ చికిత్సలో సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఏ.వి. వేణుగోపాల్ మరియు డాక్టర్ శ్రీనివాస్ తో కూడిన క్రిటికల్ కేర్ బృందం కీలక పాత్ర పోషించారు. ఐసియు నుంచీ తిరిగి కోలుకునే వరకు విభిన్న విభాగాల వైద్యులు సమన్వయంతో పనిచేశారు.ఈ విషయంపై కేర్ హాస్పిటల్స్, విశాఖపట్నం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మయూఖ్ చౌధురి మాట్లాడుతూ, “ఇలాంటి సంక్లిష్ట కేసులకైనా సరైన సమయంలో సరైన వైద్యం అందించడమే మా లక్ష్యం. రాధారాణి పూర్తిస్థాయి కోలక మూలం మా వైద్యబృంద నైపుణ్యం, అంకితభావం,” అని పేర్కొన్నారు. రాధారాణి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతున్న సమయంలో మాట్లాడుతూ, “నాకు మళ్ళీ నడవలేనని అనిపించింది. కానీ ఇక్కడి డాక్టర్లు నాకు కొత్త జీవితం ఇచ్చారు. ఇప్పుడు నేను తిరిగి నడుస్తున్నాను, స్వతంత్రంగా జీవించగలుగుతున్నాను. అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను,” అని భావోద్వేగంగా తెలిపారు.అత్యాధునిక న్యూరాలజీ, బహుళ శాఖల వైద్య సేవలతో కేర్ హాస్పిటల్స్ గణనీయమైన మార్పులు తీసుకొస్తూ, సంక్లిష్ట వ్యాధులకు సకాలంలో విజయవంతమైన చికిత్సను అందిస్తూ ముందంజలో ఉంది.