ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఉండ్రాజవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం పి.హెచ్.సి. వైద్యాధికారి డా. ఆర్. ఉషాదేవి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా డా. ఉషాదేవి గారు మాట్లాడుతూ, పొగాకు ఉత్పత్తు లైన ఖైని, గుట్కా, జర్దా, సిగెరెట్, చుట్ట, బీడీ మొదలగునవి సేవించడం వలన వాటిల్లో ఉండే నికోటిన్ అనే మత్తు పదార్ధము వలన, వాటికి బానిసలుగా మారిపోయి, అనారోగ్యం పాలగుతారని, ఊపిరితిత్తులు దెబ్బ తిని శ్వాస సంబంధిత సమస్యలు రావడమే కాక, తద్వారా గుండె జబ్బులు, సంతానం కలగక పోవడం,కేన్సర్ మొదలగు ప్రాణాంతక వ్యాధులు వస్తాయని తదుపరి అకాల మరణం కూడా రావచ్చునని, కావున పైన పేర్కొన్నట్లుగా పొగాకు, కానీ వాటి ఉత్పత్తులు ను కానీ, వాడకుండా పొగాకుతో తయారీ అయిన వాటిని వాడే వారిలో, అవగాహన కల్పించాలని, తద్వారా వారి జీవన శైలిలో మార్పు తీసుకుని రావాలని, అందరూ ఆరోగ్యం గా జీవించేటట్లు ప్రజలు లో అవగాహన పెంపొందించాలని తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో సి.హెచ్.ఓ సుబ్రహ్మణ్యం గారు, పి.హెచ్.ఎన్ కుమారి గారు, సీనియర్ అసిస్టెంట్ నారాయణరెడ్డి గారు, స్టాఫ్ నర్స్ సంధ్య గారు, ఫార్మాసిస్ట్ శ్రీదేవి గారు, హెల్త్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం గారు, ఏ ఎన్ మ్స్ , తదితరులు పాల్గొన్నారు.
