ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ శాసనమండలి సభ్యులు పి. వి. ఎన్ మాధవ్
భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బారతీయ జనతా పార్టీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి ఆధ్వర్యంలో బారతీయ జనతా పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ పర్యవేక్షణలో రాణి పుణ్య శ్లోక అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి వేడుకలు స్థానిక వి. కె ఫంక్షన్ హాల్ లో శనివారం ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి మాజీ శాసనమండలి సభ్యులు పి. వి. ఎన్ మాదవ్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు బొల్లిన నిర్మలా కిషోర్, మహిళా మోర్చ జిల్లా అధ్యక్షురాలు అల్లూరి పద్మ వర్మ,కిసాన్ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట గంగరాజు, బీజేపీ నాయకులు మాజీ మునిసిపల్ చైర్మన్ ముళ్ళపూడి రేణుక, అహల్యాబాయి హోల్కర్ కార్యక్రమాల ఇంచార్జ్ ఉన్నమట్ల కబర్థి, కోట రాంబాబు, పి.వి రాఘవులు ముఖ్య అతిథిలు గా హాజరయ్యారు. తొలిత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు బొల్లిన నిర్మలా కిషోర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమాలు ఏడాది పాటు ఏ విధంగా నిర్వహించారో, అదేవిధంగా రాణి పుణ్య శ్లోక అహల్యా బాయి హోల్కర్ కార్యక్రమాలు కూడా ఏడాది పాటు నిర్వహించడానికి భారతీయ జనతా పార్టీతో పాటు అనుబంధ సంస్థలకు పిలుపునివ్వడం జరిగిందన్నారు.దీనిలో భాగంగా ఈ నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అహల్యాబాయి హోల్కర్ జయంతి కార్యక్రమాలను ప్రతి బీజేపీ కార్యకర్త,నాయకులు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర,కేంద్ర నాయకులు నిర్ణయించడం జరిగిందన్నారు..అందులో భాగంగా ఈ రోజు తణుకు లో పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందన్నారు. మాజీ శాసనమండలి సభ్యులు పి. వి. ఎన్ మాదవ్ (ముఖ్య వక్త) మాట్లాడుతూ రాణి అహల్యాబాయి హోల్కర్ 1725లో చండి అనే గ్రామంలో జన్మించటం జరిగిందన్నారు. ఆమె కుటుంబ సభ్యులందరూ చనిపోయినప్పటికీ,1966 రాజ్యాధికారం చేపట్టి,సమర్థవంతంగా రాజ్యపాలన చేసి, కాశీ నుంచి కన్యాకుమారి వరకు,సుమారు 40 వేల హిందూ ఆలయాల పునర్నిర్మాణానికి కృషి చేశారన్నారు.యుద్ధ సమయంలో వ్యూహాత్మకంగా ఆలోచించి రక్తం చెందకుండా విజయం సాధించడంలో ఆమెకు చాటి ఎవరూ లేరన్నారు.మహిళలు ఎందులో కూడా తీసుకుపోరని, నిరూపించిన వీర వనిత అన్నారు. పిరంగులు తయారు చేసే ఫ్యాక్టరీ,వస్త్ర వ్యాపారాలు, జల సంరక్షణతంతి తపాలా, వంటి వ్యాపారాలు సమర్థవంతంగా నిర్వహించారన్నారు.తన రాజ్యంలో బీదవాళ్లు ఎవరు ఉండకూడదని చట్టం చేసిన ఏకైక వ్యక్తి అన్నారు.ఆమె స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు ముందుకు నడవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఆకుల లీలకృష్ణ, బీమవరం పట్టణ అధ్యక్షులు,అడబాల శివ,తణుకు పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, ప్రధాన కార్యదర్శి రాసాబత్తుల అనుకుమార్,బుద్దాల రాజ్యలక్ష్మి, మహిళా మోర్చ పట్టణ అధ్యక్షులు గంటా లక్ష్మి, ఉపాధ్యక్షులు కసిరెడ్డి మణిదీప్, కొడమంచిలి జితేంద్ర,మారిశెట్టి అజయ్,ఇరగవరం,అత్తిలి మండలం అధ్యక్షులు, నాయకులు అధిక సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.