నిడదవోలులో యుద్ధ ప్రాతిపదికన ఆర్వోబీ పనులు పూర్తిచేయాలి
క్షేత్రస్థాయిలో ఆర్వోబీ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి దుర్గేష్
స్థానిక వ్యాపారులను, వాహనదారులతో చర్చించి సమస్యలను ఆరా తీసిన మంత్రి దుర్గేష్
డ్రెయిన్లలో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని ఆదేశం
వాహన ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయం
ఆర్వోబీ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి, ప్రజారవాణాకు ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని అధికారులకు ఆదేశంక్షేత్రస్థాయిలో ఆర్వోబీ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి దుర్గేష్
స్థానిక వ్యాపారులను, వాహనదారులతో చర్చించి సమస్యలను ఆరా తీసిన మంత్రి దుర్గేష్
డ్రెయిన్లలో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని ఆదేశం
వాహన ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయం
ఆర్వోబీ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి, ప్రజా రవాణాకు ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని అధికారులకు ఆదేశం
నిడదవోలు పట్టణ వాసులు సుధీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని మంత్రి కందుల దుర్గేష్ అధికారులకు సూచించారు. శనివారం నిడదవోలు పట్టణంలో పర్యటించిన మంత్రి దుర్గేష్ స్థానిక ప్రజలు, అధికారులతో కలిసి నడుస్తూ ఆర్వోబీ పనులను, అలైన్ మెంట్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రొక్లెయిన్ పైకి ఎక్కి పనుల తీరును పర్యవేక్షించారు. స్థానిక వ్యాపారులను, వాహనదారులను అడిగి సమస్యలను ఆరా తీశారు. వర్షపు నీటికి సాధారణ మట్టి బంకమట్టిగా మారడంతో తరుచూ వాహనాలు జారుతూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, దీనికి త్వరితగతిన పరిష్కారం చూపాలని స్థానికులు కోరగా మంత్రి దుర్గేష్ స్పందించారు. ఈ సందర్భంగా డ్రెయిన్లలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని వెంటనే తొలగించే పనులు చేపట్టాలని, కాలువల్లో పడుతున్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని తద్వారా నీరు సాఫీగా వెళ్లేందుకు చర్యలు చేపట్టాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. త్వరితగతిన ఆర్వోబీ పనులు పూర్తయితే ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా రాకపోకలకు ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నిడదవోలు ప్రజలందరూ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆర్ఓబీ నిర్మాణ పనులు శరవేగంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.గుంతల్లో నీరు నిల్వ ఉండటం, మట్టి తవ్వకం వల్ల డ్రెయిన్లు మూసుకుపోయి నీళ్లు రోడ్లపైకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుందన్నారు. గడిచిన రెండేళ్లుగా స్థానిక వ్యాపారస్తులకు, వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని తమ దృష్టికి వచ్చిందని మంత్రి గారు తెలిపారు. త్వరగా వర్షాలు రావడంతో పనులు నెమ్మదించాయని ఇకపై వాహన ప్రమాదాలు జరగకుండా పరిష్కారం చూపించి అరికడతామన్నారు. మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారని తెలిపారు.ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకునే ప్రాంతాల్లో పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించానన్నారు. నిల్వ ఉన్న నీరును బయటకి పంపే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గం చూస్తున్నామన్నారు. ఆర్వోబీ పనులు నాణ్యతతో చేపట్టాలని అధికారులను మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు.