అండగా ఉంటా… అధైర్యపడొద్దు

నిడదవోలు పట్టణంలో పలు బాధిత కుటుంబాలను పరామర్శించి భరోసానిచ్చిన మంత్రి దుర్గేష్

నిడదవోలు పట్టణంలో శనివారం పర్యటించిన మంత్రి కందుల దుర్గేష్ పలు కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటామని, అధైర్యపడవద్దని సూచించారు. తొలుత పట్టణంలోని 4వ వార్డులో ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని ఆరోగ్యంగా ఇంటికి వచ్చిన గంగుల గోపియాదవ్ ను పరామర్శించి ఆరోగ్య వివరాలను, స్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం 8వ వార్డు లో ఇటీవల గోదావరి స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన నెత్తి ప్రకాష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయా కుటుంబాల పరిస్థితిని చూసి మంత్రి దుర్గేష్ చలించారు.

Scroll to Top
Share via
Copy link