ఆశ కార్యకర్తలకు టీబీ ఇంటెన్సిఫైడ్ క్యాంపెనింగ్ శిక్షణ కార్యక్రమం.
మంగళవారం ఉండ్రాజవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఆశ కార్యకర్తలకు టీబీ ఇంటెన్సిఫైడ్ క్యాంపెనింగ్ కార్యక్రమంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో వైద్యురాలు డాక్టర్ ఆర్ ఉష దేవి మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు రాత్రిపూట జ్వరం బరువు తక్కువగా ఉన్న వారిని గుర్తించి వారికి టీవీ నిర్ధారణ పరీక్షలు చేయించవలసిందిగా సూచించారు టీబీ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ ఆశాజ్యోతి ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులు నిర్వహించి ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిలో టీబీ వ్యాధి నివారణ మందులు వాడుతున్న వారిని గుర్తించి వివరాలు నమోదు చేసుకోవాలని ఏఎన్ఎంలకు ఆశలకు సిహెచ్ఓ లకు సూచించారు. పోషకాహార నిమిత్తం ప్రభుత్వం నెలకి వెయ్యి రూపాయలు చొప్పున అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ సుబ్రహ్మణ్యం పి హెచ్ ఎన్ కుమారి, ఎం పి హెచ్ ఎస్ శ్రీనివాస్, ఎమ్మెల్యే హెచ్ పి లు ఏఎన్ఎంలు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.