ఏఎన్ఎం – ఆశ వర్కర్లకు సైబర్ నేరాలుపై అవగాహన సమావేశం

డాన్ బాస్కో నవజీవన బాల భవన్ స్వచ్ఛంద సేవా సంస్థ విజయవాడ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఉండ్రాజవరం మండలం ఉండ్రాజవరం గ్రామంలో గల పీహెచ్సీ నందు MLHP, ఏఎన్ఎం మరియు ఆశ వర్కర్లకు సైబర్ నేరాలు వాటిపై తీసుకోవలసిన జాగ్రత్తలు, సురక్షితమైన డిజిటల్ పౌరులుగా ఉండుటకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమమును నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల కస్టర్ కోఆర్డినేటర్ శ్రీ తేజ మాట్లాడుతూ, ప్రస్తుతం కాలంలో సైబర్ నేరాలు అధికంగా జరుగుతున్నాయని వాటి బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని తెలిపారు. సైబర్ కేటుగాళ్లు లక్కీ డ్రా ,ఉచిత రీఛార్జ్, గిఫ్ట్ కూపన్లు వంటి తదితర ఉచిత డబ్బును పొందే మార్గాలు అని ఆశ చూపి మన బ్యాంకులో డబ్బును కొల్లగొడుతున్నారు. సైబర్ నేరాలు జరిగినప్పుడు వెంటనే స్పందిస్తే బాధితులకు న్యాయం జరుగుతుందని అన్నారు. సైబర్ మోసం జరిగిన గంటలోపే హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు కాల్ చేయటం మర్చిపోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ సుబ్రహ్మణ్యం, పీహెచ్ఎన్ కుమారి తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link