వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం అత్తిలి మండలి మండలంలో పాలూరు గ్రామ కమ్యూనిటీ హాల్ నందు మంగళవారం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డేబోరా ఆయిల్ ఫామ్ ప్రధాన శాస్త్రవేత్త ఎం.వి. ప్రసాద్, మార్టేరు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త కీటక విభాగ శాస్త్రవేత్త ఆనంద్ కుమార్, ప్లాంట్ బ్రీడింగ్ శాస్త్రవేత్త తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలూరు ఈడూరు కొమ్మర రైతులతో సార్వా పంటలో ఆచరించవలసిన యాజమాన్య పద్ధతులపై రైతులకు తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ మాట్లాడుతూ వరిలో సూచించిన మేరకు మాత్రమే ఎరువులు వినియోగించాలని ఎట్టి పరిస్థితులలో పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులు వాడరాదని భాస్వరం ఇచ్చే ఎరువులు మొత్తం కాంప్లెక్స్ ఎస్ఎస్సి డి. ఏ. పి. దమ్ములోనే వేయాలని సూచించారు ఆరోగ్యకరమైన నారును పెంచాలని నాటేటప్పుడు సుతలు త్రుంచి నాటినట్లయితే కాండం తొలిచే పురుగు గుడ్లు నాశనం అయ్యి పురుగు ఉధృతి తగ్గుతుందని అదేవిధంగా పంట నాటిన 40 రోజుల వరకు పురుగుమందులు పిచికారి చేసే పరిస్థితి ఉండదని తెలిపారు. అదేవిధంగా ఆయిల్ ఫామ్ శాస్త్రవేత్త ఎం. వి. ప్రసాద్ మాట్లాడుతూ రైతులు ప్రత్యామ్నాయ పంటలు ఆరుతడి పంటలు ఆయిల్ ఫామ్ పంటలపై అవగాహన పెంచుకుని వాటిని సాగు చేయడం ద్వారా అధికమైన ఆదాయాన్ని పొందవచ్చని రైతులకు తెలియజేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో డి.సి. ప్రెసిడెంట్ నల్లూరి సురేష్, గ్రామ సర్పంచ్ దయామణి, వైస్ ప్రెసిడెంట్ రాపేటి సింహాచలం, పోతినీడి శ్రీను, ఆల్తి అజయ్ కుమార్, కూటమి నాయకులు అల్లూరి రఘువర్మ కటిక రెడ్డి ప్రసాద్, సాహిత్య, రాము, సత్యనారాయణ, సౌమ్యశ్రీ, మోహన్ కిషోర్, భాను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
