విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ పిలుపు
రానున్న యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తణుకు పట్టణంలో ఈనెల 5న యోగాంధ్ర–2025 కార్యక్రమం నిర్వహించనున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. తణుకులోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల లో ఈనెల 5, గురువారం ఉదయం 6 గంటలకు యోగాంధ్ర కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యోగా ట్రైనర్లు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు, కూటమి నాయకులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ పిలుపునిచ్చారు.