ముత్యాలమ్మపాలెం పంచాయతీ సూపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో : టిడిపి సీనియర్ నాయకులు చింతకాయల ముత్యాలు
విశాఖపట్నం: (కోస్టల్ న్యూస్)
అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం పంచాయతీ లో మత్స్యకార సంక్షేమ సంఘాల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చింతకాయల ముత్యాలు ఆధ్వర్యంలో జరిగిన సూపరిపాలన, తొలి అడుగు ముత్యాలమ్మపాలెం పంచాయతీ లో జోరుగా హుషారుగా సాగుతుంది. ఈ సందర్భంగా గ్రామస్తులు పూలమాల వేసి ఘన స్వాగతం పలికారు అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలతో డోర్ టూ డోర్ తిరిగి పథకాలపై ప్రజలకు అడిగి తెలుసుకోవడం జరిగింది. అనంతరం రాష్ట్ర మత్స్యకార నేత టిడిపి సీనియర్ నాయకులు చింతకాయల ముత్యాలు మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారని ప్రజల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన జీవన స్థితిని కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలుగుదేశం పార్టీ ప్రజల సంక్షేమం కోసం, ముఖ్యంగా రైతులు, మహిళలు, యువత మరియు వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలపై ప్రతి ఇంటిలోకి వెళ్లి గడపగడపకూ చంద్రబాబు నాయుడు సంకల్పాన్ని చాటి చెప్పాలన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ హయాంలో జరిగిన నష్టంతో పాటు ఏడాది కాలంలోనూ ప్రజలుమెచ్చిన పాలన అందించామని వివరించారు. అత్యధిక కుటుంబాలకు మేలు చేకూర్చేలా తల్లికి వందనం కింద గతంలో ఒక్కరికే రూ.15 వేలు చెల్లిస్తే, ఇప్పుడు ఇద్దరికి మించి పిల్లలున్న వారందరికి రూ.30 నుంచి 60వేల వరకు తల్లి ఖాతాలో జమ చేసిన విషయానికి ప్రాధాన్యత వివరించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో చెత్తపన్ను రద్దు చేయడం, పేదల కోసం అన్నక్యాంటీన్లను ప్రారంభించడం, నెలవారీ పింఛన్ ను రూ. నాలుగు వేలకు పెంచడం, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, మెగా డీఎస్సీ, ఒంటరి మహిళలకు పింఛన్లు, డ్వాక్రా సంఘాల్లో రుణ వితరణలో ప్రాధాన్యత వంటి అంశాలతో పాటు ఉచితగ్యాస్ పథకమే కాకుండా కొద్దిరోజుల వ్యవధిలోనే అన్నదాత సుఖీభవ కింద రైతులకు అండగా నిలవడం, ఆగస్టు నుంచి మహిళలందరికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న విషయాన్ని ప్రజలకు వివరించేందుకు అడుగులు వేస్తున్నామని, రాష్ట్ర మత్స్యకార నేత చింతకాయల ముత్యాలు అన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సొసైటీ అధ్యక్షులు కోవిరి ముత్యాలు, మత్స్యకార నాయకులు అర్జిల్లి అప్పారావు, స్కూల్ కమిటీ చైర్మన్ అర్జిల్లి కృష్ణ, టిడిపి నాయకులు, అర్జిల్లి అప్పలరాజు, తెలుగు దేశంపార్టీ నాయకులు, మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.