గ్రంధాలయ ఉద్యమ స్ఫూర్తి ప్రదాతలు మన మార్గదర్శకులు

గ్రంథాలయ ఉద్యమానికి అవిరళ కృషి చేసిన డా. ఎస్.ఆర్. రంగనాధన్, పాతూరి నాగభూషణం, అయ్యంకి వేంకట రమణయ్య ల స్ఫూర్తితో గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేయాలని విశ్రాంత ఆంగ్ల భాష అధ్యాపకులు కోట రామ ప్రసాద్ విద్యార్థులకు పిలుపు నిచ్చారు.

గ్రంధాలయ వారోత్సవాల్లో భాగంగా మూడవ రోజు శనివారం స్థానిక శాఖా గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో గ్రంధాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆకెళ్ళ శ్రీనివాస్ స్వాగతం పలికారు. గ్రంధాలయాధికారి గుత్తికొండ కృష్ణారావు అధ్యక్షత వహించారు.

జ్యోతి ప్రజ్వలన అనంతరం డా. ఎస్.ఆర్. రంగనాథన్ చిత్రపటానికి రిటైర్డు పోస్ట్ మాష్టర్ ఆకెళ్ళ సుబ్రహ్మణ్యం, అయ్యంకి వేంకట రమణయ్య చిత్ర పటానికి కోట రామ ప్రసాద్, పాతూరి నాగభూషణం చిత్ర పటానికి వెంపటి వెంకటేశ్వర్లు పష్పమాలలు అలంకరించారు.

ఈనాటి కార్యక్రమంలో విద్యార్థులలో జూనియర్స్ గా నున్న 6,7 తరగతుల విద్యార్థులకు “స్వచ్చతే సేవా కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం”, సీనియర్స్ గా నున్న 8,9 విద్యార్థులకు “విద్యార్థులపై సోషల్ మీడియా ప్రభావం” అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఆకెళ్ళ సుబ్రహ్మణ్యం పోటీలో పాల్గొన్న విద్యార్థులందరికీ పెన్నులు బహూకరించారు.

ఈ కార్యక్రమంలో శ్రీమతి గుత్తికొండ స్రవంతి, వెంపటి వెంకటేశ్వర్లు, అయిశెట్టి శ్రీనివాస్, ఇలపకుర్తి జగదీష్, వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link