రాజమండ్రి టౌన్ హాల్ అద్భుతమైన కళావేదిక. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది

2027 గోదావరి పుష్కరాల నాటికి రాజమండ్రి టౌన్ హాల్ ను దేదీప్యమానంగా వెలిగేలా చేస్తానని హామీ ఇచ్చిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. రాష్ట్ర సాంస్కృతిక శాఖ తరపున నిధులు సమకూర్చి రాజమండ్రి టౌన్ హాల్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్న మంత్రి దుర్గేష్రా జమహేంద్రవరంలోని శ్రీ కందుకూరి వీరేశలింగం పురమందిరం (టౌన్ హాల్) జూబ్లీ పబ్లిక్ లైబ్రరీ & రీడింగ్ రూమ్ సమాజ్ లో నిర్వహిస్తున్న 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. తను మంత్రి అయిన తర్వాత సంపూర్ణ సంతోషం అందించిన కార్యక్రమం ఇదే అని ఉద్ఘాటించిన మంత్రి కందుల దుర్గేష్ 2027 గోదావరి పుష్కరాల నాటికి రాజమండ్రి టౌన్ హాల్ ను దేదీప్యమానంగా వెలిగేలా చేస్తానని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు. శనివారం సాయంత్రం రాజమహేంద్రవరంలోని శ్రీ కందుకూరి వీరేశలింగం పురమందిరం (టౌన్ హాల్) జూబ్లీ పబ్లిక్ లైబ్రరీ & రీడింగ్ రూమ్ సమాజ్ లో నిర్వహిస్తున్న 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. రాష్ట్ర సాంస్కృతికశాఖ తరపున నిధులు సమకూర్చి రాజమండ్రి టౌన్ హాల్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషిచేస్తానని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా టౌన్ హాల్లో తన గత స్మృతులను మంత్రి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టౌన్ పేరుతో ఏర్పాటు చేసిన మొట్టమొదటి టౌన్ హాల్ కందుకూరి వీరేశలింగం పుర మందిరం అని మంత్రి పేర్కొన్నారు. ఇదొక అద్భుత కళావేదికని తెలిపారు. వేలాదిగా రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలు జరగడానికి వేదికగా నిలిచిందన్నారు. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఈ టౌన్ హాల్ ని కొంతమేర మరమ్మత్తులు చేసి ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించామన్నారు. నగరం నడిబొడ్డున ఉన్న అద్భుతమైన ప్రాంగణం ఈ టౌన్ హాల్ అని దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వీర్రాజు అనే వ్యక్తి ఈ ప్రాంతంలో పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారని మంత్రి అభినందించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రిగా టౌన్ హాల్ వేదికగా మాట్లాడే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి మంత్రి దుర్గేష్ కృతజ్ఞతలు తెలిపారు. పుర మందిరాన్ని అద్భుతమైన కట్టడం గా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని గ్రంధాలయ సభ్యులకి సూచించారు. అదే విధంగా కందుకూరి వీరేశలింగం పంతులు స్వగృహాన్ని ప్రత్యేకశ్రద్ద వహించి మంచిగా మార్చేందుకు కృషి చేద్దామన్నారు.. ఇందుకు కేంద్రప్రభుత్వం ఆధీనంలోని కట్టడాలకు సంబంధించిన విభాగంతో సంప్రదింపులు చేసి సహకారం కోరుతామన్నారు. తాను మంత్రి అయిన తర్వాత సంపూర్ణ సంతోషం అందించిన కార్యక్రమం ఇదే అని మంత్రి దుర్గేష్ ఉద్ఘాటించారు. స్థానిక ఎంపీ పురందేశ్వరి, స్థానిక శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసులతో కలిసి రాజమండ్రి టౌన్ హాల్ ను ఆధునికీకరిస్తామని, గోదావరి పుష్కరాల నాటికి దేదీప్యమానంగా వెలిగేలా చేస్తామని మంత్రి తెలిపారు. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వ్యక్తిగా టౌన్ హాల్ లో పునర్జీవింప చేసే బాధ్యతతీసుకుంటానన్నారు. కార్యక్రమంలో గ్రంధాలయ వారోత్సవ కార్యక్రమ నిర్వహణ సభ్యులు వీర్రాజు, శ్రీనివాసులు, సుబ్బారావు, సతీష్, సునీల్, వీరబాబు, రమణ తదితరులు పాల్గొన్నారు..

Scroll to Top
Share via
Copy link