ఉండ్రాజవరం శాఖా గ్రంథాలయంలో అష్టావధానం

గ్రంధాలయ వారోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు సోమవారం నాడు స్థానిక శాఖా గ్రంథాలయంలో అష్టావధానం నిర్వహించారు. మోర్త ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు చెరుకూరి వెంకట కృష్ణ ప్రసాద్ పర్యవేక్షణ లో పాఠశాల విద్యార్థినులతో అష్టావధానం నిర్వహించారు. ఈ అష్టావధానంలో చి.జె.ప్రసన్న లక్ష్మీ అవధానిని గా మరి ఎనిమిది విద్యార్థినులు ప్రుచ్చకులుగా పాల్గొన్నారు. ఈ అష్టావధానం ఆసాంతం ఆసక్తిగా నడిచింది. ఈ సందర్భంగా తెలుగు ఉపాధ్యాయులు చెరుకూరి వెంకట కృష్ణ ప్రసాద్ మరియు అవధాని చి. జె. ప్రసన్న లక్ష్మి లను గంధాలయాధికారి గుత్తికొండ కృష్ణారావు, గ్రంధాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆకెళ్ళ శ్రీనివాస్, రిటైర్డు ఆంగ్ల భాష అధ్యాపకులు కోట రామ ప్రసాద్ ప్రభృతులు దుశ్శాలువా, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. అనంతరం బాల బాలికలకు కోట రామ ప్రసాద్ ఆధ్వర్యంలో వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొడ్డేటి శ్రీనివాసరావు, ఇలపకుర్తి జగదీష్, శ్రీమతి గుత్తికొండ స్రవంతి, వివిధ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link