తణుకు పట్టణంలో స్థానిక సొసైటీ రోడ్డులో ఉన్న అన్నాక్యాంటీన్ ను తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంలో ఆయన అక్కడ భోజనం చేయుచున్న పేదప్రజలు, మధ్యతరగతి ప్రజలను అన్నాక్యాంటీన్లో అందిస్తున్న భోజనవసతి సౌకర్యాల గురించి భోజన లోటుపాట్లు గురించి వారిని ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ అన్నక్యాంటీన్ ప్రారంభించిన నాటినుండి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం మంచి వంటకంతో భోజనసదుపాయం ముఖ్యమంత్రి నారాచంద్రబాబు ఆదేశాల మేరకు కొనసాగుతున్నదని, పేదబడుగు మధ్యతరగతిప్రజలు తణుకు పట్టణంలో వివిధ పనుల నిమిత్తం వచ్చిన వారి ఆకలి ఈ ఎన్టీఆర్ అన్నాక్యాంటీన్ ద్వారా తీరుస్తుందని అన్నారు. ప్రతిరోజు తణుకు అన్నక్యాంటీన్ నందు సుమారు 1500 మంది టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అన్న క్యాంటీన్లను పున ప్రారంభించి, నాణ్యమైన భోజన సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం అన్నాక్యాంటీన్ లను అర్ధాంతరంగా మూసివేసి పేద ప్రజలు ఆకలితో బాధపడే విధంగా చేసిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మరల అన్నక్యాంటీన్లు పెట్టి పేదప్రజలు ఆకలి తీరుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టి.డి.పి. జనసేన, బి.జే.పి. నాయకులు పాల్గొన్నారు.
