తణుకు పట్టణంలో ఎమ్మెల్యే కార్యాలయం నందు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించినారు, ఈ సందర్భంగా అరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు నిర్వహించిన ప్రెస్ మీట్ లో మరల కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాతే, మరల లేహం ఇండస్ట్రీ కి పర్మిషన్ వచ్చింది అన్న మాటను పూర్తిగా ఖండిస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ లేహం ఇండస్ట్రీకి పర్మిషన్లు ఇచ్చిందని అన్నమాటలో ఎటువంటి నిజంలేదని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో ఈ ఫ్యాక్టరీ కి ఏ పర్మిషన్స్ ఉన్నాయో కారుమూరి నాగేశ్వరరావు మంత్రిగా పనిచేసిన సమయంలో ఉన్న ఆ పర్మిషన్ ఉన్నాయని అప్పటిలో నేను ప్రతిపక్షనాయకుడిగా ఉన్నప్పుడు ఆ పరిమిషన్స్ పేపర్ ద్వారా చూపించడం జరిగిందన్నారు. రెండు, మూడు ప్రెస్ మీట్ లు జరిగిన తర్వాత పర్మిషన్స్ ఉన్న కాగితాలు డేట్స్తో సహా చూపించిన తర్వాత మళ్లీ నాపై ప్రెస్ మీట్ లు పెట్టడం జరగలేదని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో తెచ్చిన పర్మిషన్లు తప్ప కొత్తగా తెచ్చిన పర్మిషన్లు ఏవి లేవని అన్నారు. అప్పుడు కోర్టులో స్టే ఇవ్వడం జరిగిందని ఆ విధంగా దానిని పెండింగ్లో పెట్టడం జరిగిందని, ఈరోజు ప్రభుత్వం ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వలేదని కోర్టులో ఉన్నదని కోర్టు స్టే వెకెట్ అయిందని తెలిసిన వెంటనే నేను వెంటనే అధికారులని ఎంక్వయిరీ చేయడం జరిగిందని వారు చెప్పిన ప్రకారం గతంలో ఏదైతే స్టే ఉందో ఆస్టే వైడ్ అవ్వడం జరిగిందని అని నాకు అధికారులు చెప్పడం జరిగింది అని అన్నారు.ఈరోజు ఒక మాజీ మంత్రిగా బాధ్యతాయుతంగా మాట్లాడిన అవసరం ఉందని అక్కడ ఏం జరుగుతుందని పూర్తిసమాచారం తెలుసుకోవాల్సి ఉందని, తనకు ఉన్నటువంటి సమాచారము వరకు అక్కడ ఎటువంటి గోవధ జరగడంలేదని అన్నారు. ఈరోజు మాజీ మంత్రి అక్కడ గోవద జరుగుతుందని ఆయన మాట్లాడుతున్నారని అన్నారు. ఆ ఫ్యాక్టరీలో బఫెల్లో స్లాట్రింగ్ జరుగుతుందని మాకు ఉన్నటువంటి సమాచారము మీద అధికారులతో కూడా మాట్లాడడం జరిగిందని రాబోయే రెండు రోజుల్లో అధికారులు కూడా వాటిపై విధి విధానాలను ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయని వారు చట్టవిరుద్ధంగా కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా అనేది కూడా వెరిఫికేషన్ చేయిస్తామని, ప్రభుత్వ శాఖల అధికారులను పిలిపించి దానిపై సరియైనచర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొనడం జరిగింది.
