మహాత్మగాంధీ 155వ జయంతి సందర్భంగా తణుకు మండలం, మండపాక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మండపాక గ్రామ సర్పంచ్ జాన వెంకటలక్ష్మి. ఈ సందర్భంగా స్వచ్ఛతా హి సేవ, గ్రామసభను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత చెత్త నుండి సంపద తయారీ కేంద్రం పునః ప్రారంభించారు గ్రామ సర్పంచ్. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వట్టికూటి శివ నాగ ప్రసాద్, మండపాక గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు జాన శ్రీనివాస్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి ఎం. యుగంధర్, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామసచివాలయ సిబ్బంది, టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
