రీ సర్వేలో జరిగిన అవకతవకలను పున:సమీక్షచేసి ప్రజాభాగస్వామ్యంతో ప్రభుత్వం చేపట్టిన ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్ట్ నిమిత్తం మండలంలో పైలట్ గ్రామంగా ఎంపిక చేయబడ్డ సత్యవాడ సచివాలయంలో గురువారం నిర్వహించబడిన గ్రామసభకు తహసిల్దార్ పి యన్ డి ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఫీల్డ్ లెవెల్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డులు శుక్రవారం నుండి 18 తేదీ శనివారం వరకు జరుగుతాయని, ప్రభుత్వ భూముల సర్వే ఈనెల 21 నుండి 30 వరకు, ప్రైవేటు భూములు సర్వే ఫిబ్రవరి 02 నుంచి 27 తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ జి శ్రీనివాసరావు, రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్, ఎం.హరి ప్రసాద్, వీఆర్వో జె.లక్ష్మి నరసమ్మ, గ్రామ సర్వేయర్ ఆర్. మారుతి శ్రీరామ్, పంచాయతీ కార్యదర్శి జి ప్రసాదరావు, మండలంలోని వీఆర్వోలు, గ్రామసర్వేయర్లు, విఆర్ఎ లు పాల్గొన్నారు.
