వాన్ బరి యాజమాన్యం, కార్మికులు మధ్య వేతన ఒప్పందం కుదిరిందని యూనియన్ అధ్యక్షులు, సి.ఐ.టి.యు. జిల్లాకార్యదర్శి పీవీ. ప్రతాప్, యూనియన్ ప్రధాన కార్యదర్శి వల్లూరి వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఏలూరు జేసీయల్ కార్యాలయంలో జేసీయల్ సమక్షంలో ఇరువురు ఒప్పంద పత్రాలు పై సంతకాలు చేయడం జరిగింది. ఈ సందర్బంగా ప్రతాప్, వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ ఈ అగ్రిమెంట్ ఏప్రిల్ 1,2024నుండి 2026 మార్చి వరకు రెండు సంవత్సరాలు అమలులో ఉంటుందని తెలిపారు. ఎన్నో సంవత్సరాలనుండి కార్మికులకు మాత్రమే అగ్రిమెంట్ జరుగుతుందని స్టాఫ్ అండ్ వర్కర్స్ కి కూడా ఈ ఒప్పందంలో ఉన్నారని తెలిపారు. ఈ ఒప్పందం విజయవంతం కావడానికి యాజమాన్యం నుండి డైరెక్టర్ జి. బాలప్రభాకర్, GM,mvssn.మూర్తి, HRDGM t. వెంకటేశ్వర రావు లకు,కార్మికులకు యూనియన్ ధన్యవాదములు తెలిపింది. అగ్రిమెంట్ వివరాలు :1, సంవత్సరానికి వర్కర్స్ కేడర్ కి రూ.3,100/-, ఎగ్జిక్యూటివ్స్, జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ కేడర్ కి రూ.3,500/-, సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ కేడర్ కి రూ 4000/- చొప్పున పెంపుదల జరిగింది. 2, వర్కర్స్ కి ఓటి డబ్బల్, స్టాఫ్ కి ఒకటిన్నర అమలు చేయడం జరిగింది. 3.LTA రెండు సంవత్సరాలకు రూ. 3000/-పెరిగింది. 4,నైట్ షిఫ్ట్ అలవెన్స్ రూ. 90/-పెరిగింది. 5, VDA పాయింటికి గవర్నమెంట్ రేటు కంటే అదనంగా రూ. 7.50పెంచుకోవడం జరిగింది. బోనస్ రూ.13000/-6, nmr లను పర్మినెంట్ చేయడం7,స్టాఫ్ అండ్ వర్కర్స్ కి 3 లక్షలు ఇన్సూరెన్స్ అమలు వంటి ఈ అంశాలు పై కార్మికులు, యాజమాన్యం అంగీకారం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు గుబ్బల గోపి, yt. రామకృష్ణ, హర్షవర్ధన్, జయకృష్ణ, కేతా శ్రీనివాస్, లక్ష్మి నారాయణ, j.శ్రీనివాస్ రాజు, సి.ఐ.టి.యు. ఏలూరు జిల్లా కార్యదర్శి dnvd. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
