గీత కార్మికులపై గీత కార్మికులపై ఎక్సైజ్ అధికారు దాడులు తక్షణం ఆపాలని ఏపీ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. శనివారం నాడు తణుకులోని అమరవీరుల భవనంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశము కామన మునిస్వామి అధ్యక్షతన జరిగినది.
ఈ సమావేశంలో కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిత్తిగా నరసింహుమూర్తి మాట్లాడుతూ బెల్టుషాపులు, అక్రమ మద్యం, అరికట్టలేని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు గీత కార్మికులపై దాడులు చేసి అవమానపరుస్తున్నారని ఊరుకోబోమని నరసింహమూర్తి హెచ్చరించారు. కూటమి ప్రభుత్వము అధికారంలోనికి రాకముందు ఎన్నికల ప్రచారంలో గీతవృత్తిని కాపాడతామని గీత కార్మికుల కార్పొరేషన్ కి నిధులు కేటాయిస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత గీత కార్మికులనే పై దాడులు చేయడం దుర్మార్గం అన్నారు. గ్రామాల్లో బెల్టషాపులను ఏర్పాటు చేసి విడిగా లెక్కలే కుండా వ్యాపారాన్ని సాగిస్తున్నారని దీనికి అధికారులు ప్రజాప్రతినిధులు తోడైయ్యారని దీనివల్ల కల్లు అమ్మకాలు లేక గీత కార్మి కుటుంబాలు పస్తులు తో ఉంటున్నారని నరసింహమూర్తి అన్నారు. గీత కార్మికులపై ఇదే విధానం కొనసాగితే ఎక్సైజ్ఆఫీసెస్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. గీత కార్మికులకు పెన్షన్లు ఎటువంటి ఆంక్షలు లేకుండా 50 సంవత్సరాలకే ఇవ్వాలని, గీత కార్మికులకు వడ్డీ లేని రుణాలు ప్రభుత్వాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాకమిటీ సభ్యులు కడలి పాండు, బొంతు శ్రీనివాసు బొక్క చంటి, కాసాని శీను, కడలి బాలాజీ
కట్ట వెంకటేశ్వరరావు , గుబ్బల వీరరాఘవులు పాల్గొని మాట్లాడినారు.
