నిడదవోలు నియోజకవర్గం, ఉండ్రాజవరం మండలం, కే..సావరం గ్రామంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిమిత్తం పట్టబధ్రుల ఎమ్మెల్సీ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్క పట్టభద్రులు తమ తొలి ప్రాధాన్యత ఓటును ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకి వేసి గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్. ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇంచార్జ్ బోరుగడ్డ వేదవ్యాస్ ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా నాయకులు కాకర్ల నాని, నిడదవోలు నియోజకవర్గం బిజెపి కన్వీనర్ బండి సత్యనారాయణ, కె. సావరం గ్రామ సర్పంచ్ నార్ని రామకృష్ణ, ఎంపీటీసీ సభ్యులు కాకర్ల కరుణాకర్, పాలంగి గ్రామ టిడిపి అధ్యక్షులు ఈడుపుగంటి ఉదయ్ కుమార్, ఉండ్రాజవరం మండలం బిజెపి అధ్యక్షులు కొప్పినీడి బాలాజీ, ఉండ్రాజవరం మండల జనసేన అధ్యక్షులు వీరమల్ల బాలాజీ, కే.సావరం, పాలంగి, మోర్త, కాల్దరి, దమ్మెన్ను తాడిపర్రు, ఉండ్రాజవరం, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
