అన్నం పరబ్రహ్మ స్వరూమని ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ చైర్మన్, ప్రముఖ సీనీ నిర్మాత డా.కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విశాఖలోని శ్రీ ఉమా రామలింగేశ్వర ఆలయంలో ఆయన గురువారం ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన అన్నసమారాధన కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీనివాస్ పట్నాయక్, టీడీపీ నాయకులు కాళ్ల శంకర్ లతో కలిగి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన శివరాత్రి రోజున ఈ ప్రాంత వాసులకు అన్నదానం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఉపకార్ ఛారిటుబల్ ట్రస్టు ద్వారా కొన్నేళ్ల నుంచి దైవకార్యక్రమాలు చేపడుతున్నామని రానున్నరోజుల్లో కూడా తమ సేవలను కొనసాగిస్తామన్నారు. తమ ట్రస్ట్ ద్వారా అన్నదాన కార్యక్రమాలు భారీ ఎత్తున చేయడానికి కారణం ఆ కాశీ అన్నపూర్ణ ఆశీస్సులు, దీవెనలు అందరిపై ఉండాలన్నదే అభిమతమన్నారు. అన్నదానాలతోపాటు, సాంస్క్రుతిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్నామన్నారు. యువత ఆధ్యాత్మిక చింతన అవలవాటు చేసుకోవాలని సూచించారు. అయితే చదవు లేదంటే క్రీడలు అదీ కాదనుకుంటే ఆధ్యాత్మిక సేవలో తరించాలి తప్పితే చెడు వ్యససానాలకు దూరంగా ఉండాలన్నారు.జనసేన నాయకులు శ్రీనివాస్ పట్నాయక్, టీడీపీ నాయకులు కాళ్ల శంకర్ లు మాట్లాడుతూ, విశాఖలో నే కాకుండా రాష్ట్రవ్యాప్తం డా.కంచర్ల అచ్యుతరావు తమ ఉపకార్ ఛారిటుబుల్ ట్రస్టు ద్వారా ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. మంచి మనసుతో లేనివాకి చేయూత నందిస్తూ దైవ కార్యక్రమాల్లో నిత్యం పాలుపంచుకుంటూ ఈ ప్రాంతవాసుల మన్ననలు పొందుతున్నారని అన్నారు. ఒక ఉన్నతలక్ష్యంతో సేవా కార్యక్రమాలు చేపట్టే డా.కంచర్ల మరింత ఉన్నతస్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అంతకు ముందు ఆదర్శ గ్రామ యువజన సేవాసంఘం యూత్ సభ్యులు, మహిళలు డా.కంచర్లకు ఘనస్వాగతం పలికి, స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ మేనేజర్ సుధీర్, నాగు, అరుణ, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
