ఉండ్రాజవరం హైస్కూల్ లో ఘనంగా జరిగిన జాతీయ సైన్స్ దినోత్సవ వేడుక

మహనీయులు అందించిన సైన్స్ ఆవిష్కరణలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి విద్యార్థి విజ్ఞానశాస్త్రం పట్ల అవగాహనతో కొత్త కొత్త ఆవిష్కరణ వైపు ప్రయాణించినప్పుడే దేశ పురోగతి, ప్రపంచ పురోగతి సాధ్యమవుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే ఎస్ కే మాణిక్యాలరావు విద్యార్థుల ఉద్దేశించి ఉద్బోధించారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ సివి రామన్ లాంటి విఖ్యాత శాస్త్రవేత్తలు అందించిన అనేక ఆవిష్కరణలే నేడు ప్రపంచగతిని మార్చాయని ఆ మహనీయుల యొక్క స్ఫూర్తితో ప్రతి విద్యార్థి ఉన్నత విద్యావంతులుగా మారి శాస్త్రవేత్తలుగా రూపొంది కొత్త కొత్త ఆవిష్కరణలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పలు సైన్స్ రూపకాలు విద్యార్థులు ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా పాఠశాల సీనియర్ సైన్సు ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ, మాధవి, కోటి మాణిక్యం, అరుణకుమారి, తంగిరాల రామశేషంద్ర తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారుచేసిన పలు సైన్స్ ఎగ్జిబిట్స్ ప్రదర్శన ఎంతగానో చూపరులను ఆకట్టుకున్నాయి.

Scroll to Top
Share via
Copy link