మండల కేంద్రమైన ఉండ్రాజవరంలో వేంచేసియున్న శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత శ్రీ గోకర్ణేశ్వర స్వామి ఆలయంలో శ్రీ బాలాత్రిపుర సుందరి అమ్మవారికి ఈరోజు చైత్ర పౌర్ణమి సందర్భంగా బాలాత్రిపురసుందరి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం, సహస్ర నామ కుంకుమ అర్చనలు జరిగినట్లు అర్చకులు మద్దిరాల వెంకటరమణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ పౌర్ణమికి శ్రీ బాలాత్రిపురసుందరీ అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహిస్తామని, అదేవిదంగా లలితా సహస్ర పారాయణ జరుగుతుందని తెలిపారు., అనంతరం అమ్మవారిని భక్తులు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
