ఉండ్రాజవరం పి.హెచ్.సి.పరిధిలో ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ను మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్.ఉషాదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ ఆర్. ఉషాదేవి మాట్లాడుతూ మలేరియా అంతం మనతోనే.. అనే నినాదంతో అందరూ ముందుకు వెళ్ళాలని “మలేరియా వ్యాధికి సంబంధించి నిర్ధారణ కీలకమని, జ్వరం వస్తే సొంత వైద్యం గానీ, నేరుగా మెడికల్ షాప్స్ అడిగి మెడిసిన్స్ తీసుకుని వాడడం సరికాదని, జ్వరం ఉంటే డాక్టర్ ను సంప్రదించాలని, ప్రజలకు క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని “సిబ్బందికి మార్గదర్శనం చేశారు. సిబ్బంది అంకితభావంతో పనిచేయడం ద్వారా మలేరియా నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. ఆరోగ్య పర్యవేక్షకులు జిన్నూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్లాస్మోడియంతో ఇన్ఫెక్ట్ అయిన ఆడ ఎనాఫిలాస్ దోమ మనిషిని కుడితే మలేరియా జ్వరం వస్తుందని, కదలిక లేని నీరు ఉన్న చెరువులు, వాడని నీటి బావులు, నీటిగుంతలు, లోతట్టు ప్రాంతాలు, నిర్మాణ ప్రాంతాలు ఉన్న నీరు, సిమెంట్ తొట్టెలలలో ఉన్న నీరు ఈదోమ పుట్టుకకు నిలయాలని, వీటి విషయమై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా 2030 వ సంవత్సరానికి మలేరియా నిర్మూలన లక్ష్యానికి అనుగుణంగా క్షేత్రస్థాయి సిబ్బంది పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పి.హెచ్.సి సిబ్బంది, క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.
