2024 -25 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఉన్నతి రుణాలు మంజూరు రూ.7.75 కోట్లు లక్ష్యం కాగా, రూ.8.32 కోట్లు రుణాలను మంజూరు చేయడమే కాకుండా రుణాల రికవరీ 99.91 శాతం సాధించినందుకు రాష్ట్రంలోనే పశ్చిమగోదావరి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. లక్ష్యానికి మించి రుణాల మంజూరు, రికవరీ బాగా చేయించడానికి కృషి చేసిన డిఆర్డిఏ ఉన్నతి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ తిరుమాని మురళీకృష్ణను సోమవారం పీజిఆర్ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పుష్పగుచ్చాన్ని అందించి అభినందించారు. భవిష్యత్తులో కూడా ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పడెలా విరివిగా రుణాలను అందజేసి వారి అభ్యున్నతికి కృషి చేయాలని ఈ సందర్భంగా తెలిపారు. ఉన్నతి రుణాల మంజూరులో జిల్లా అవార్డును సాధించడానికి తోడ్పాటును అందించిన ఎపిఎంలు, సీసీలు, వివోఏ లు, ప్రాజెక్ట్ సిబ్బంది అందర్నీ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంలో డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, తదితరులు ఉన్నారు.