నిడదవోలు: కోట సత్తెమ్మ అమ్మవారి వార్షిక తిరునాళ్ల చివరిరోజు వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. తిరునాళ్ల చివరిరోజు సందర్బంగా బాణసంచా కాల్చి, వివిధ వేషధారణల్లో భక్తులు ప్రదర్శన ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా నిడదవోలు మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు దంపతులు హాజరయ్యారు. అదేవిదంగా ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయ పాలకవర్గం సభ్యులు తిరునాళ్ల ఏర్పాట్లను సమర్థంగా నిర్వహించి, భక్తులకు అన్నిరకాల సౌకర్యాలు, సేవలు అందించారు. వేలాలాదిగా భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయాయి. అమ్మవారి ఆశీర్వాదం కోసం భక్తులు ఉత్సాహంగా పాల్గొని అమ్మవారి తీర్ధప్రసాదాలు స్వీకరించారు.
