మాజీ మంత్రివర్యులు ఆచంట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో భాగంగా
రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ నియోజకవర్గ కేంద్రమైన ఆచంట లోని సబ్ స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కరెంటు చార్జీలకు సంబంధించి ఇప్పటికే 6 వేలకోట్ల బాదుడు మొదలైంది. మరో 9,412.50 కోట్ల భారం వచ్చే జనవరి నెల నుంచి వినియోగదారులపై మోపేందుకు సిద్ధమవుతున్నారు, మొత్తం రూ. 15,485.36 కోట్ల చార్జీల బాదుడు అత్యంత దారుణం అక్టోబర్ లో వచ్చిన కరెంటు బిల్లులకు నవంబర్లో డిసెంబర్లో వచ్చిన కరెంట్ బిల్లుల్లో బాదుడు కనిపించడంతో ప్రజలు చాలా భయపడుతున్నారు, వందల్లో వచ్చే కరెంటు బిల్లు వేలల్లోకి చేరుకుంటుంది. అంత మొత్తంలో బిల్లులు కట్టుకోలేక ప్రజలు నరకం చూస్తున్నారు, ఎస్సీ ఎస్టీ కుటుంబాలు 200 యూనిట్లు కరెంటు బిల్లు వాడుకున్నందుకు గతంలో బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉండేది కాదు, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వ పాలనలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది 200 యూనిట్లు లోపు వాడుకున్న సరే వేలాది రూపాయలు బిల్లులు చెల్లించాలంటూ నోటీసులు ఇస్తున్నారు. బిల్లులు కట్టలేని వారి ఇళ్లకు వెళ్లి కరెంటు మీటర్లు తొలగిస్తున్నారు. చాలీచాలని జీతాలతో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దళితులపై చార్జీలు పిడుగు పడేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి తక్షణమే ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్లు ఉచిత కరెంటును పునరుద్దించాలని డిమాండ్ చేస్తూ ఆచంట విద్యుత్ సబ్స్టేషన్ లో అధికారులకు రిప్రజెంటేషన్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆచంట నియోజకవర్గం వైస్సార్సీపీ పార్టీ వివిధ హోదాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.
