శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర – స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా శనివారం తణుకు పట్టణంలో పాల్గొంటారని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు అన్నారు. దీనిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన కొరకు చేసే ఏర్పాట్లను రాష్ట్ర స్వచ్చంద్ర కార్పొరేషన్ చైర్మన్ కె.పట్టాభి రామ్, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, జిల్లా జాయింట్ కలెక్టర్ టి .రాహుల్ కుమార్ రెడ్డి, తో కలిసి సంయుక్తంగా పరిశీలించారు,
ఈ సందర్భంగా జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్ ఆవరణలో ప్రజా వేదిక వద్ద రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డా .నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేక ఆరోగ్యానికి పెద్దపీట వేయటం జరిగింది అన్నారు.
ఈ సమాజంలో ప్రతి ప్రాంతం,దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి అన్నారు. అప్పుడే తాను చేయవలసిన పనులు సాధ్యమై సక్రమంగా నిర్వర్తించగలరు అన్నారు. వ్యక్తిగతంగా మనం ఎంత శుభ్రంగా ఉంటామో మన చుట్టుపక్కల కూడా అంత శుభ్రంగా ఉండాలి అన్నారు. మానవ వనరులను పరిపూర్ణముగా వినియోగించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్య ఆనంద ఆంధ్రప్రదేశ్ గా మార్చాలని ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ రోజుగా పరిగణలోనికి తీసుకోవటం జరిగిందని అన్నారు. దీనిలో భాగంగా శనివారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా తణుకు పట్టణం లో పాల్గొని రాష్ట్ర ప్రజలకు ఒక మెసేజ్ అందజేయడం జరుగుతుందని చెప్పారు. ముందుగా స్థానిక ఎన్టీఆర్ పార్క్ లో పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. అనంతరం తణుకు హోల్ సేల్ కూరగాయల మార్కెట్ పాల్గొని వేస్ట్ మెటీరియల్ నీ ఎట్లా ప్రాసెస్ చేయాలని ఉద్దేశంపై మాట్లాడతారని చెప్పారు. గత ప్రభుత్వంలో పార్కులు అభివృద్ధికి నోచుకోక వేలవేల బోయి ఉన్నాయని పి4 మోడల్ గా అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. పబ్లిక్ శానిటేషన్ సిబ్బందితో ముఖ్యమంత్రి ముఖాముఖిగా మాట్లాడతారని అన్నారు. అనంతరం పార్టీ శ్రేణులతో పాల్గొనటం జరుగుతుందని అన్నారు. తదుపరి విజన్ 2047 పై తీసుకోవలసిన చర్యలపై అధికారులతో సమీక్ష ఇస్తారని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు అన్నారు. ముందుగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పాల్గొనే హెలీ ప్యాడ్, ప్రజా వేదిక, ఎన్టీఆర్ పార్క్, హోల్సేల్ కూరగాయల మార్కెట్, ప్రాంతాలోజరుగుచున్న ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంలో రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె. పట్టాభిరామ్, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, శాసనసభ్యులు ఆరమిల్లి రాధాకృష్ణ, ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి,జిల్లా అదనపు ఎస్పి వి. భీమారావు, ఆర్డీవోలు ఖతిబ్ కౌసర్ భానో, దాసిరాజు, యూ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.