గ్రామాల అభివృద్ధి కొరకు ఉద్యోగులు ప్రజాప్రతినిధులు అని చేయాలని ఉండ్రాజవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి వివి ఎస్ రామారావు అన్నారు. గురువారం ఉండ్రాజవరం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజాప్రతినిధుల ఒకరోజు శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు గ్రామ మండల స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా ప్రణాళిక ఉద్యమం 2025 26 గ్రామపంచాయతీ వార్షిక ప్రణాళికల తయారీ, మార్గదర్శకం వంటి వాటిపై శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాలాటి ఎల్లారీశ్వరి, గ్రామ సర్పంచులు మెండే వెంకట్రావు, అత్తిలి సత్యనారాయణ, కరటూరి నరేంద్రబాబు గురజర్ల సత్యనారాయణ, నార్ని రామకృష్ణ, రఘుమండ తేజస్వి, కో ఆప్షన్ సభ్యులు షాజహాన్, ఈవో పి ఆర్ డి ఆంజనేయ శర్మ, ఎంఈఓ శారదా జ్యోత్స్న ఎంపీటీసీలు, గ్రామ కార్యదర్శులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
