- జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతల డిమాండ్
- విశాఖ జిల్లా నూతన అధ్యక్షుడుగా నరసింగరావు
- చట్ట సభల్లో బీసీ లకు 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.నాగేశ్వరరావు అన్నారు. ద్వారకా నగర్ పబ్లిక్ లైబ్రరీలో విశాఖ జిల్లా నూతన అధ్యక్షుడిగా నక్కెళ్ళ నరసింగరావు పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు వై. నాగేశ్వర రావు, మాట్లాడుతూ, దేశ జనాభాలో 60 శాతం బీసీ ప్రజలు వున్నారని గుర్తు చేశారు. చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్ బిల్లు, మహిళా బిల్లు ప్రవేశపెట్టాలని కోరారు. బీసీ ఉద్యోగుల కోటా లో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. కేంద్ర, రాష్ర్ట స్థాయిలో మంత్రిత్వ శాఖ ద్వారా నిధులు ఇవ్వాలనీ కోరారు. ఈ మేరకు గ్రామ స్థాయి నుంచి డిల్లి వరకు ఉద్యమాలు చేపట్టాం అని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక స్థానిక సంస్థల ఎన్నికలు నిమిత్తం హామీ ఇచ్చారని చెప్పారు. ప్రస్తుతం బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇస్తున్నారు అని తెలిపారు. బీసీ లకు ప్రభుత్వ పక్కా ఇళ్లు కూడా కేటాయించాలని కోరాం అన్నారు. అలాగే, అన్ని జిల్లాల్లో బీసీ భవన్ లు నిర్మిస్తామని మంత్రులు హామీ ఇచ్చారని చెప్పారు. విశాఖ జిల్లా నూతన అధ్యక్షుడు నక్కెళ్ళ నరసింగరావు పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం మాట్లాడుతూ, తన మీద నమ్మకం ఉంచి, ఈ పదవి అప్పగించిన జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య, రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వర రావు యాదవ్, మహిళా అధ్యక్షురాలు నూకాలమ్మ లకు ధన్య వాదాలు తెలిపారు. నామినేటెడ్ పదవులలో బీసీ లకు 35 శాతం నుంచి 50 శాతానికి పెంచడానికి ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. అనంతరం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నూకానమ్మ మాట్లాడుతూ, 400 మంది సంఘంలో చేరడానికి ముందుకు రావడం సంతోషకరం అన్నారు. సంఘం ద్వారా గ్రామ స్థాయి నుంచి డిల్లి వరకు ఎందరో ప్రజాప్రతినిధులు తయారు అయ్యారని చెప్పారు. ఉద్యమాల వళ్లనే ప్రభుత్వాలు బీసీలకు మేలు చేస్తున్నాయి అన్నారు. బీసీ ల సమస్యలు ఎమ్మేల్యే, ఎంపీల దృష్టికి తీసుకు వెళ్ళాం అన్నారు. అన్ని నియోజక వర్గంలలో బీసీ సంఘం కమిటీలు వేస్తాం అన్నారు. రాష్ట్ర యువజన అధ్యక్షుడు డబ్బీరు కుమార స్వామి మాట్లాడుతూ, త్వరలో జరిగే రాష్ర్ట మంత్రివర్గ విస్తరణలో బీసీ లకు సముచిత స్థానం ఇవ్వాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా యువజన విభాగం బలోపేతం చేస్తూ, బీసీ ల సమైక్యత కోసం యువత ముందుకు రావాలని కోరారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తాను అన్నారు.
- కార్యక్రమంలో పల్లా మహేష్, గుండిబోయన రవి, బొమ్మడి ఎల్లజి, విశాఖ అష్టలక్ష్మీ, వారణాసి అన్నాజీ తదితరులు పాల్గొన్నారు.
