సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ వాడకం నిషేధం – నిడదవోలు మునిసిపల్ కమీషనర్ కృష్ణవేణి

స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర విజన్ లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి మూడవ శనివారం (మార్చి 14)థీమ్ సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ వాడకం నిషేధం మరియు 120 మైక్రానుల కన్నా తక్కువ గల ప్లాస్టిక్ నిషేధం గురించి నిడదవోలు పట్టణంలో మునిసిపల్ కమీషనర్ ఆధ్వర్యంలో పట్టణంలోని డొక్కా సీతమ్మ స్కూల్ విద్యార్థులకు ,ప్రజలకు
పర్యావరణ పరిరక్షణ
సింగల్ యుజ్ ప్లాస్టిక్
తడి, పొడి మరియు హానికరచెత్త వేరు చేయడం వలన కలుగు ఉపయోగాల గురించి అవగాహన కల్పించడమైనది.
పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ ను నిషేధించాలని మునిసిపల్ కమీషనర్ శ్రీమతి కృష్ణవేణి కోరారు. నిడదవోలు పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని వీక్లీ మార్కెట్లో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం ప్రమాదకరమని, ప్లాస్టిక్ భూమిలో కరగకపోవటంతో కాలుష్యం పెరుగుతుందని, త్రాగునీరు కలుషితమై ప్రజలు అనారోగ్య పాలవడం, ఆవులు, అనేక జీవ ప్రాణులు మరణిస్తున్నాయన్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే కాలుష్యంతో అనేక ప్రమాదాలు ఉన్నాయని, ప్రజలందరూ ఐక్యంగా ప్లాస్టిక్ వాడకాన్నినియంత్రించి పర్యావరణాన్ని కాపాడుకోవాలని కోరారు. వ్యాపారులందరూ 120 మైక్రాన్ ల కన్నా తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ కవర్ల విక్రయాలను వెంటనే నిలిపివేయాలని కోరారు. ప్లాస్టిక్ నియంత్రణలో ప్రభుత్వం నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలందరూ కలిసి ప్లాస్టిక్ వాడకం నియంత్రించి స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మునిసిపల్ కౌన్సిలర్స్, మునిసిపల్ అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link