ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ ప్రారంభపనులకు ప్రధాని నరేంద్ర మోడీ, శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా అమరావతిలో నిర్వహిం చిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ, చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఒక నగరం కాదు ఒక శక్తి అని మోడీ అన్నారు.
తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన నరేంద్ర మోడీ అమరావతి స్వప్నం సహకారం అవుతుంది చరిత్రక పరంపర ప్రగతి రెండు కలిసి పయనిస్తున్న ట్లు కనిపిస్తుంది ఒక కొత్త అమరావతి కొత్త ఆంధ్రప్ర దేశ్, రూపు దాల్సుతుంది అన్నారు. దుర్గ భవాని కొలువున్న భూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరో మహోన్నత ఘట్టం ఆవిష్కృతం అవుతోంది.. ఆంధ్రుల కల సాకారం కాబోతోంది. ఐదు కోట్లమంది ఆంధ్రుల ఆశగా, ఆకాంక్షగా ఉన్న అమరా వతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ వేడకకు అంతా సిద్ధమైంది.అన్నారు.
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాంప్రధాని మోదీ
పోలవరం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పూర్తి చేస్తాం. ఒక ప్పుడు ఏపీ, తెలంగాణకు రైల్వే బడ్జెట్ రూ.900 కోట్ల లోపే ఉండేది. ఇప్పుడు ఒక్క ఏపీకే రూ. 9000 కోట్ల రైల్వే నిధులు కేటాయిం చాం. ఏపీలో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదల వుతుంది. రైల్వే ప్రాజెక్టుల తో రాష్ట్రాల మధ్య అను సంధానం పెరుగుతుంది. ఇది ఆర్థిక, పర్యాటక అభివృద్ధికి దోహదం చేస్తుంది’ అని ప్రధాని మోదీ అన్నారు.
అంతరిక్ష కార్యక్రమాల్లో ఏపీకి మరింత ప్రాధాన్యం: ప్రధాని మోదీ
దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్.. భారత అంతరిక్ష ప్రయోగాలకు కేంద్రంగా ఉంది. శ్రీహరికోట కోట నుంచి జరిగే ప్రతి రాకెట్ ప్రయోగం.. యావత్ దేశవాసులను ఉత్తేజం కలిగిస్తోంది. నాగాయ లంకలో డీఆర్డీవో మిస్సైల్ టెస్టింగ్ కేంద్రం ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఇది భారత రక్షణ, పరిశోధన రంగానికి మరింత ఊతమిస్తుంది.
చంద్రబాబునాయుడికే సాధ్యం: ప్రధాని మోదీ
ఇవి కేవలం శంకుస్థాపనలు కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రగతికి, వికసిత్ భారత్కు నిదర్శనాలు. ఒక స్వప్నం సాకారం అవుతుందనే విషయం కళ్లముందు కనిపిస్తోంది. ఒక ఉత్తమమైన పనిని ప్రారంభించాలన్నా, దాన్ని మెరుగ్గా, వేగంగా పూర్తిచేయాలన్నా.. దేశంలో ఒక చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యం’ అని నరేంద్ర మోదీ అన్నారు. దుర్గా భవానీ కొలువైన పుణ్యభూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు మోదీ.
రూ.58,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన మోదీ
రాజధాని పనులతో పాటు రూ.58,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అమరావతి సభావేదిక నుంచే శంకుస్థాపన చేశారు. వీటిలో రూ.49,040 కోట్ల విలువైన అభివృద్ధి పనులను రాజధాని అమరావతిలో చేపడతారు. రూ. 8 వేల కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులకు కూడా ఈ సందర్భంగా ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. మొత్తం 18 ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.
అమరావతికి మోదీ ఆశీస్సులు కావాలి: చంద్రబాబునాయుడు
ఒక్క అమరావతిని మాత్రమే కాక అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తాం. మోదీ సూచనల మేరకు ఏపీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటాము. విశాఖకు రైల్వే జోన్ వచ్చింది. దానికి కూడా కేంద్రానికి ప్రత్యేక ధన్యవాదాలు. సీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం. కడపలో స్టీల్ ప్లాంట్ వస్తుంది. భోగాపురం విమా నాశ్రయాన్ని త్వరలోనే ప్రారంభిస్తాం. బిట్స్ పిలానీ వంటి సంస్థలు మన రాష్ట్రానికి రావడానికి ఆసక్తి చూపుతున్నాయి అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.