ఇరగవరం మండలం గోటేరు గ్రామానికి చెందిన తోట సత్యనారాయణకి గతంలో హార్ట్ కి ఓపెన్ సర్జరీ జరిగింది, ఇటీవల జ్వరం వచ్చిందని హాస్పిటల్ కి వెళ్ళితే డాక్టర్ అన్ని టెస్ట్ లు చేసి గుండె దగ్గర నరం బాగా ఉబ్బింది, వెంటనే మరలా ఆపరేషన్ చెయ్యాలి లేకపోతే ప్రాణానికి చాలా ప్రమాదం అని తెలిపారని కానీ ఆపరేషన్ ఇక్కడ చేయడానికి కావలసిన పరికరాలు లేవు, హైదరాబాద్ గాని చెన్నై గాని వెళ్ళాలని తెలుపగా సత్యనారాయణ కుటుంబ సభ్యులుతో కలసి చెన్నైలోని వెల్లూరు CMC హాస్పిటల్ కి వెళ్లారు, అక్కడ డాక్టర్లు ఆపరేషన్ కి 10,00000/- పది లక్షలు ఖర్చు అవుతుందన్నారు. ఆర్ధిక ఇబ్బందులతో సతమతమయ్యే చిన్న కుటంబం కావడంతో జనసేవక్ ఫౌండేషన్ స్పందించి నిసహాయ స్థితిలో ఉన్నా వారి పరిస్థితి తెలుసుకుని వారికి సహాయం చెయ్యాలనే సంకల్పంతో జనసేవక్ ఫౌండేషన్ ద్వారా టీమ్ సభ్యులు సహకారంతో దాతలు దగ్గర ఫండ్ కలెక్ట్ చేసి 1,00000/- లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేవక్ ఫౌండేషన్ సభ్యులు వర్రే రమేష్ బాబీ, నార్ని దుర్గారావు, మీసాల సురేష్, ముత్యాల ముత్తయ్య, నార్ని వాసు, కొమ్మిరెడ్డి రామకృష్ణ, నార్ని వెంకట్రావు, గుత్తుల నారాయణ, వరగన పుల్లేశ్వరరావు, నాగిరెడ్డి నాని, గిరుగు మణికంఠ, చల్లా పవన్, మీసాల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గున్నారు.
