బాలలదినోత్సవం సందర్భంగా పిల్లలకు చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి డి.సత్యవతి మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులని, పిల్లలు చిన్నప్పటి నుండి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రస్తుతం సమాజంలో చిన్నపిల్లలపై లైంగికదాడులు ఎక్కువ అయ్యాయని, ఇటువంటి అవగాహన సదస్సుల వల్ల కొంత ఉపయోగం ఉంటుందని, తల్లితండ్రులు పిల్లల్ని ఒంటరిగా ఎక్కడకు పంపించకూడదని, అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలన్నారు, ముఖ్యంగా సెల్ ఫోన్ లు అవసరానికి మాత్రమే వాడాలన్నారు, 18 సంవత్సరాల లోపు పిల్లలు అందరూ తప్పక చదువుకోవాలని నిర్భంధవిద్య హక్కు చట్టం వుందని, బాలకార్మికులుగా పిల్లలు పనిచేయుట నేరమని, బాల్యవివాహాలు చేయుట నేరమని దానికి శిక్షలు వున్నాయని, శ్రీమతి పొనంగి శ్రావణి సమీరా మాట్లాడుతూ గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పిస్తూ ఎవరైనా వొంటిమీద చెయ్యివేసిన, చెడుగా ప్రవర్తించిన వెంటనే తల్లితండ్రులకు తెలియ చెయ్యాలని అన్నారు. బాల, బాలికలపై సొంత బంధువులు లైంగిక దాడులకు పాల్పడుతున్నాడని దానికి కఠిన శిక్షలు వున్నాయని, ఆడ మగ అనే లింగ వివక్ష లేకుండా ఆడ మగ ఒకటేనని, అడ పిల్లలు మగవారితో పోలిస్తే తక్కువ వున్నారని, అడపిల్లలను రక్షించుకోవాలని అన్నారు. చైల్డ్రెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ చాక్లెట్స్ పంచిపెట్టారు. ఇందులో న్యాయమూర్తులు డి.సత్యవతి, న్యాయవాదులు కౌర్ వెంకటేశ్వర్లు, ముప్పిడి సుబ్బయ్య, కత్తుల జస్పాల్, టి.సత్యనారాయణ రాజు, శ్రీమతి పోనంగి శ్రావణి సమీరా, ఆంగజాల అజయ్ కుమార్, అంగన్వాడి టీచర్లు మరియు స్కూలు టీచర్లు పాల్గొన్నారు.
