స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎస్ కే ఎస్ డి మహిళా కళాశాల డిగ్రీ అండ్ పీజీ (అటానమస్) కళాశాల ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ మరియు ఎన్సిసి భాగాల వారు మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారని ప్రిన్సిపల్ కెప్టెన్ యు. ఎల్ సుందరి భాయ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఎన్సిసి క్యాడెట్లు పరిసరాల శుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పై సూచనలు తెలియజేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ కె.వి. శ్యామలాదేవి, సిహెచ్ రమేష్ బాబు, ఎన్సిసి క్యాడేట్స్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.
