జాతీయ న్యాయ సేవల సంస్థ ఢిల్లీ, రాష్ట్ర న్యాయ సేవల సంస్థ గుంటూరు, జిల్లా న్యాయ సేవల సంస్థ ఏలూరు వారి ఆదేశము మేరకు మండల ప్రజా పరిషత్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాలులో ఇరగవరం, పెనుమంట్ర పశ్చిమ గోదావరి జిల్లా చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి తణుకు శ్రీమతి డి. సత్యవతి అద్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విధాన్ సే సమాధాన్ కార్యక్రమములో భాగంగా అంగన్వాడి కార్యకర్తలకు, డ్వాక్రా మహిళలకు, ఆశ కార్యకర్తలకు మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తూ చట్టాలపై అవగాహన కలిగి వున్నప్పుడే నేరాల సంఖ్య తగ్గుతుందని అన్నారు. వివిధరకాల చట్టాలపై అవగాహన కల్పిస్తూ ఏమైనా సంఘటనలు జరిగితే ఎలా రక్షణ పొందాలి, ఎవరిని సంప్రదించాలి అని తెలుపుతూ యాసిడ్ అటాక్ చట్టం, మహిళలు ఆశకు పోయి సైబర్ క్రైమ్ లలో ఇరుక్కుంటున్నారని, మెంటల్ హెల్త్ యాక్ట్, లైంగిక వేదింపులు చట్టం, డొమెస్టిక్ వయోలెన్స్ చట్టం మరియు దైనందిన జీవితంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను న్యాయ సేవల సంస్థ ద్వారా ఎలా పరిష్కరించుకోవాలి అని, సమస్యలున్నప్పుడు న్యాయ సేవల సంస్థ టోల్ ఫ్రీ నెంబర్ 15100 ను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు 4వ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి డి. సత్యవతి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి కె. కృష్ణసత్యలత, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి పొతర్లంక సాయిరామ్, రెండవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఏ.వి. నాగరాజు, స్పెషల్ కోర్టు మెజిస్ట్రేట్ పీవీఎస్ చిరంజీవిరావు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూరంపూడి కామేష్, నరసాపురం ఆర్.డి.ఒ. దాసిరాజు, తహసిల్దార్ పెనుమంత్ర యేలేటి రవి కుమార్, ఇరగవరం మెడిది సుందరరాజు, ఎం.పిడి.ఒ లు ఇరగవరం ఏ. శ్రీనివాసు, పెనుమంట్ర బి.వి.ఎస్.వి. శర్మ, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ లు శ్రీమతి ప్రమోదిని కుమారి, ఏ. కృష్ణకుమారి సబ్ ఇన్స్పెక్టర్ లు ఇరగవరం జానా సతీష్, పెనుమంట్ర ఇన్చార్జి కె. గంగాధరరావు, తణుకు న్యాయవాదుల కౌరు వెంకటేశ్వర్లు, కామన మునిస్వామి, ముప్పిడి సుబ్బయ్య, పైడి ధనుంజయ్ రావు, పొట్ల సురేష్, తిర్రే సత్యనారాయణరాజు, ఎస్.కె. అహ్మద్ అలీ ఖాన్ బాజీ, మహిళా న్యాయవాదులు శ్రీమతి పి. శ్రావణి సమీరా, కుమారి కోలా దుర్గ భవాని, కుమారి ఎస్.కె. మోతీ పాల్గొన్నారు
