భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి 100వ జయంతిని ఇరగవరం మండలం రేలంగి గ్రామ బూత్ నెంబర్ 162 లో బుధవారం ఘనంగా నిర్వహించారు. బిజెపి జిల్లా అధ్యక్షులు నార్నితాతాజీ , మండల అధ్యక్షులు కాట్నం పరిపూర్ణం జనరల్ సెక్రెటరీ శీలబోయిన శ్రీనివాస్, గిద్ద రాంబాబు, గుడాల నరసింహమూర్తి, పతివాడ శివప్రసాద్, ఆకుల కృష్ణ, దాసిరెడ్డి నాగరాజు, మల్లిపూడి నాగవరప్రసాద్ బిజెపి నాయకులు కార్యకర్తలు వాజ్పేయి పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ మాట్లాడుతూ దేశ అభివృద్ధికి అనేక సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలకు మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి కృషిచేయడం జరిగిందని, అలాగే దేశంలో జాతీయ రహదారులకు సంబంధించి అభివృద్ధి చేయడం జరిగిందని, దేశంలో ప్రతి రాజకీయనాయకునికి ఆయన పాటించిన విలువలే ఆదర్శమన్నారు.
