అంగన్వాడి పాఠశాల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే బొలిశెట్టి
విద్య లేని మారుమూల ప్రాంతాల్లో కూడా విద్యనీ అందించాలని ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండలం కొండ్రుపోలు కొత్తకాలనీలో బుధవారం ఆయన నూతనంగా ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా ప్రాంతాల్లో పిల్లలు ఉన్న ఆ ప్రాంతానికి దూరంగా అంగన్వాడీ కేంద్రాలు ఉంటున్నాయని అలాంటి కేంద్రాలను గుర్తించి మాకు తెలియజేస్తే అక్కడ నూతనంగా కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇవే కాకుండా రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలను మరింత సుందరంగా తీర్చిదిద్ది కార్పొరేట్ పాఠశాలకు దీటుగా తయారు చేస్తామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా కోరారు. అంగన్వాడి సూపర్వైజర్ సిహెచ్ భవాని మాట్లాడుతూ కొండ్రుపోలు కొత్త కాలనీలో 20 ఏళ్లుగా నివాసం ఉంటున్న అంగన్వాడి భవనం కూడా లేకపోవడాన్ని గమనించి అక్కడ కేంద్ర ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సూచనల మేరకు నూతన కేంద్రం ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షుడు వత్తనపల్లి కాశి, పాలూరి వెంకటేశ్వరరావు, జనసేన మండలాధ్యక్షుడు అడపా ప్రసాద్, పెంటపాడు మండలం అధ్యక్షుడు పుల్ల బాబి, పైబోయిన వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు.