ఏపీ పర్యాటకాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని ఢిల్లీలో జరుగుతున్న సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్, టూరిజం ఎగ్జిబిషన్ -2025 వేదికగా జాతీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ఆహ్వానం పలికిన పర్యాటక మంత్రి కందుల దుర్గేష్. సుస్థిర, సమగ్ర పర్యాటకాభివృద్ధి, ఆర్థిక పురోభివృద్ధి, ఉపాధి కల్పన, రూ.25 వేల కోట్ల పెట్టుబడులు ధ్యేయంగా అడుగులు వేస్తున్నామని వివరించిన మంత్రి దుర్గేష్. పీపీపీ విధానంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ప్రభుత్వం తరపున ఇన్వెస్టర్లకు మెరుగైన రాయితీలు కల్పించి పూర్తి సహకారం అందిస్తామని భరోసానిచ్చిన మంత్రి దుర్గేష్. టెంపుల్, అడ్వెంచర్, ఎకో, వెల్ నెస్, హెరిటేజ్, రిలీజియస్, అగ్రి, మెడికల్, క్రూయిజ్, బీచ్, కోస్టల్, సీప్లేన్, రూరల్, ఫిల్మ్ టూరిజంలను వృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్న మంత్రి. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులకు గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దుతామని తెలిపిన మంత్రి దుర్గేష్ . అద్భుత ప్రకృతి రమణీయతకు చిరునామ ఆంధ్రప్రదేశ్ అని తెలుపుతూ రాష్ట్ర సందర్శనకు రావాలని ఇన్వెస్టర్లను కోరిన మంత్రి దుర్గేష్.
