ప్రముఖ దేవాలయం ఒంటిమిట్ట రామాలయాన్ని అధ్యాత్మిక పర్యాటకం (టెంపుల్ టూరిజం) పరిధిలోకి తీసుకువచ్చే ప్రతిపాదన ఉంది..
టెంపుల్ టూరిజం క్రింద ఒంటిమిట్ట సీతారామ స్వామి దేవాలయానికి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనను కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఆ దేవాలయం క్రింద దేవుని గడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, పుష్పగిరి చెన్నకేశవ స్వామి టెంపుల్, బ్రహ్మంగారి మఠం, ఒంటిమిట్ట కోదండరామాలయం టెంపుల్, గండి శ్రీ వీరాంజనేయ స్వామి టెంపుల్, యాగంటి ఉమామహేశ్వర స్వామి టెంపుల్, నందవరం చౌడేశ్వరి మఠం, మహానందీశ్వర స్వామి టెంపుల్ లు ఆ చుట్టు ప్రక్కల ఉన్న టెంపుల్స్ ను అన్నింటిని కలిపి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మార్చాలన్న ఆలోచనను ఈ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో చేస్తోంది.
ఒంటిమిట్ట సీతారామ స్వామి వారి దేవాలయం తిరుపతి తిరుపతి దేవస్థానం ఆధీనంలో నడుస్తోంది. ఇప్పుడు కొత్తగా తీసుకున్న పాలసీ తరపున ఆధ్యాత్మిక టూరిజంకు కొన్ని టెంపుల్స్ ని, ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం, వెల్ నెస్ టూరిజం ఇలా వివిధ రకాల టూరిజం లకు విభిన్న సర్క్యూట్ లను ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేస్తున్నాం. ప్రస్తుతం ఒంటిమిట్ట, ఆయా ప్రాంతాలకు వచ్చే పర్యాటకులు లేదా భక్తులు ఉదయం వచ్చి సాయంత్రానికి తిరిగి వెళ్లిపోతుంటారు.
ఒంటిమిట్ట సీతారామ స్వామి దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలంటే అక్కడికి వచ్చే పర్యాటకులను లేదా భక్తులను రెండు మూడు రోజులు ఉంచాల్సిన అవసరం ఉంది.. ఇదే సమయంలో ఆ చుట్టు పక్కల ప్రదేశాలను సర్క్యూట్ గా తయారు చేసి ఆ ప్రాంతాలకు ప్రత్యేక బస్సుల్ని, టూరిజం ప్యాకేజీని ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాం.. ఒంటిమిట్ట చెరువులో బోటింగ్ కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. ఆ చుట్టు ప్రక్కల ఉన్న ఇతర దేవాలయాలను కలుపుకొని సర్క్యూట్ తయారుచేస్తే రెండు మూడు రోజులు ఉండేందుకు అవకాశం ఉంటుంది.. అలా ఉండాలంటే అక్కడ రిసార్ట్స్ లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది.. ప్రస్తుతం అక్కడ హరిత రిసార్ట్స్ లో కేవలం 4 గదులు మాత్రమే ఉన్నాయి. వాటిని పెంపొందించి మరిన్ని సౌకర్య వంతమైన రూమ్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అదే విధంగా అక్కడ ఉన్న రెస్టారెంట్ అద్భుతంగా నడుస్తోంది. దాన్ని ఆధునికీకరించి మొత్తం మీద ఒక సర్క్యూట్ గా తయారు చేయడం ద్వారా ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని మేం కృతనిశ్చయంతో ఉన్నాం. ఇప్పటికే దానికి సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించాం. ఏప్రిల్ తర్వాత దీని మీద పూర్తిస్థాయిలో అధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.
మంత్రి కందుల దుర్గేష్ ఇంకా ఏమన్నారంటే..
పరిశుభ్రత, భక్తుల సౌకర్యాల విషయంలో నాడు తీసుకున్న నిర్ణయాల వల్ల గడిచిన ఐదారేళ్లుగా ఒంటిమిట్ట క్షేత్రం అలక్ష్యానికి గురైంది..పూర్తిస్థాయిలో ఒంటిమిట్ట క్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. క్యూ ఆర్ కోడ్ తో ఇంటిగ్రేట్ చేసి మల్టీ లాంగ్వేజ్ యాక్టివిటీని ఏర్పాటు చేయాలని, అక్కడికి వచ్చిన వారు పూర్తిస్థాయిలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళం కూడా స్థల ప్రాశస్త్యం గురించి తెలియజేయాలన్న ఆలోచన చేస్తున్నాం. ఒంటిమిట్ట చెరువును పూర్తిస్థాయిలో ఆధునికీరించి చెరువులోకి నీరు వచ్చే విధంగా చేస్తున్నాం. అంతేగాక ఆ చెరువులో బోటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం. గడిచిన ఐదేళ్లలో అక్కడున్న హరిత రిసార్ట్స్ నిర్లక్ష్యానికి గురయ్యాయి. వాటిని శుభ్రపరిచి, రూమ్ ల సంఖ్య పెంచుతాం. రెస్టారెంట్స్ ను ఆధునీకరించి దాన్ని పూర్తిస్థాయిలో భక్తులకు, పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. తప్పనిసరిగా త్వరలోనే దీన్ని పూర్తిస్థాయి అధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ స్కీం ద్వారా రాష్ట్రంలో టెంపుల్స్ డెవలప్ మెంట్ కి అవకాశం ఉంది..ఈ మధ్యనే కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను ఢిల్లీలో కలిసి మాట్లాడాను. వారికి ఈ అంశాలు తెలియపర్చాం.. తమ ప్రతిపాదనలకు కేంద్రమంత్రి సూత్రప్రాయంగా అంగీకరించారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధికి మంచి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రత్యేకించి ఒంటిమిట్ట రామాలయాన్ని పర్యాటక, అధ్యాత్మిక క్షేత్రంగా తయారు చేస్తామని తెలిపారు.