
గ్రంధాలయ వారోత్సవాల్లో భాగంగా, స్థానిక శాఖా గ్రంథాలయంలో రెండవ రోజు అయిన శుక్రవారం నాడు జరిగిన సభకు గ్రంధాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆకెళ్ళ శ్రీనివాస్ స్వాగతం పలికారు. గ్రంధాలయాధికారి గుత్తికొండ కృష్ణారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పుస్తక ప్రదర్శన ను మండల విద్యాశాఖాధికారి సిహెచ్ సాక్సేనారాజు ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా యం ఈ ఓ సాక్సేనారాజు విద్యార్థులతో గంధాలయ వారోత్సవాల ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా స్థానిక పాఠశాలల విద్యార్థినీవిద్యార్థులకు చిత్ర లేఖన పోటీలు జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిత్రలేఖన ఉపాధ్యాయులు బొడ్డేటి శ్రీనివాసరావు నిర్వహించారు. జూనియర్స్ కు “పర్యావరణం”, సీనియర్స్ కు”ప్రభుత్వం – సంక్షేమం” అనే అంశాలపై పోటీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో విశ్రాంత ఆంగ్ల భాష అధ్యాపకులు కోట రామ ప్రసాద్, శ్రీమతి గుత్తికొండ స్రవంతి, సి.ఆర్. పి. పి.సాగర్, ఇలపకుర్తి జగదీష్, అయిశెట్టి శ్రీనివాస్, తల్లిదండ్రులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.