ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని మద్యం దుకాణాలు మూసివేశారు. మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుండి గురువారం సాయంత్రం ఐదు గంటల వరకు దుకాణాలు మూసివేసి ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఎన్నికలు, ఎన్నికల కోడ్ విషయం తెలియని సామాన్య ప్రజలు మద్యం కొనుగోలుకై వచ్చి, ఏమైందో, ఎందుకు మూసేశారో తెలియక అనుమానం, సమాచారం తెలిసినవారు ముందు జాగ్రత్తపడగా, కొంతమందికి ఈ విషయం తెలియకపొవడం, షాపులమూతతో నిరాశచెందారు.
