పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని సిపిఎం పార్టీ మండల కమిటీ కన్వీనర్ కామన మునిస్వామి రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. సోమవారం నాడు సిపిఎం పార్టీ, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో కరెంటు బిల్లును భోగిమంటలో వేసి దగ్ధం చేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఇరగవరం మండల కన్వీనర్ కామన మునిస్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము ప్రజలపై 17 వేల కోట్ల రూపాయలు విద్యుత్తు చార్జీల భారాలను మోపిందని అన్నారు. విద్యుత్ బిల్లులో ట్రూ ఆఫ్ చార్జీలు, కస్టమర్ చార్జీలు, ఇంధనం చార్జీలు వేసి రకరకాల పేర్లతో అదనపు భారాన్ని ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం మోపింది అన్నారు. విద్యుత్తు నిర్వహణలో లోపాలు అధికారులు, ప్రభుత్వము వలన లోపాలు జరిగితే భారాలు ప్రజలపై వేయడం సరికాదని మునిస్వామి ఆన్నారు. రు. 1.42 పైసలు ఖరీదైన యూనిట్ కరెంట్ ఛార్జిని 4.50 పైసలకు ప్రైవేటు వ్యక్తుల దగ్గర ప్రభుత్వం కొనుగోలు చేయడం అవినీతికి దర్పణం అని అన్నారు. అదేవిధంగా యూనిట్ 50 పైసలు ఖర్చు అయ్యే సోలార్ కరెంటును 2. 50 పైసలకు కొనే ఒప్పందాన్ని ఆదానేతొ చేసుకోవడo అవినీతికి నిలయమని తెలుస్తుందని అన్నారు. అమెరికన్ ప్రభుత్వం ఆదాని, అతని అనుచరులపై కేసులు పెట్టి విద్యుత్తు ఒప్పందంలో ఆంధ్రప్రదేస్ లో1700 కోట్ల రూపాయలు అధికారులకు లంచాలు ఇచ్చినట్లుగా తెలియజేసిన్నారు. రాష్ట్రంలో జరిగిన ఒప్పందాలను ఆదానీతో రద్దు చేసుకోకుండా ప్రభుత్వం నాటకం ఆడుతుందని అన్నారు. పెంచిన చార్జీలను తగ్గించకపోతే ప్రజలసమీకరణతో సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడుతుందని మునుస్వామి ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు వృత్తిగా జుత్తిగా రామాంజనేయులు గీత కార్మిక సంఘం కార్యదర్శి
పాల సత్యనారాయణ , పిల్లి ఏడుకొండలు, పేచ్చేటి నాగేశ్వరరావు, వీరవల్లి శ్రీను, గుత్తలు శివయ్య, జక్కంచెట్టి గంగాధర్ రావు తదితరులు పాల్గొన్నారు.
