వార్త‌లు

ఉండ్రాజవరంలో నాగుల చవితి ప్రత్యేక పూజలు

తూర్పుగోదావరిజిల్లా ఉండ్రాజవరం గ్రామంలో కొలువైన కుమారస్వామి క్షేత్రం స్వయంభు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కార్తీకమాసం నాగులచవితి మంగళవారం సందర్భముగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకం జరిగింది స్వామి వారికి విశేష అలంకరణ జరిగింది. భక్తులు స్వామి దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

వార్త‌లు

ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ షాక్ నలుగురి మృతి

ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ షాక్ తో నలుగురు మృతి. వివాదాస్పదమైన విగ్రహావిష్కరణ, విగ్రహావిష్కరణ రోజునే విషాదం మిగిల్చింది. విద్యుత్ షాక్ నలుగురిని విగత జీవులుగా మార్చింది. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో సోమవారం తెల్లవారుజాము చోటుచేసుకున్న విషాద సంఘటన వివరాలు. గ్రామంలో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ ఆది నుండి వివాదాల మయమైంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణను లేవ దీసింది. చివరికి జిల్లా కలెక్టర్,  ఆర్డిఓ వంటి ఉన్నతాధికారుల చొరవతో సమస్య తీరింది.

వార్త‌లు

తణుకులో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు

తణుకు నియోజకవర్గం తణుకు పట్టణంలో శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో తణుకు పట్టణములో పలు వార్డులలో CC రోడ్లు మరియు డ్రైనేజీలకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ఈరోజు 15వ ఆర్థిక సంఘం నిధులు అలాగే మున్సిపాలిటీ నుంచి సాధారణ నిధులు నుంచి దాదాపు దాదాపు 7 వర్కులకు సంబంధించి 2 కోట్ల 26 లక్షల రూపాయలతో ఈరోజు పలు పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. ఈ నిధులతో సిసి రోడ్లు

వార్త‌లు

నిడదవోలులో మంత్రి కార్యాలయం ప్రారంభం

నిడదవోలు నియోజకవర్గ కేంద్రమైన నిడదవోలు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారి కార్యాలయం నేడు మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించారు… ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నియోజకవర్గం ఇంచార్జ్ బూరుగుపల్లి శేషారావు,తెలుగుదేశం,జనసేన,బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…

వార్త‌లు

రైతులకు గిట్టుబాటు ధర అందించాలి

రైతులకు గిట్టుబాటు ధరను ప్రభుత్వము ప్రకటించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జుత్తిగ నరసింహామూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ ఇరగవరం మండలo ఆరో మహాసభ రేలంగి గ్రామంలో అమర జీవులు బొంత్తు సత్యనారాయణ మరియు జోగి సాక్షి స్మారక ప్రాంగణములో ఇల్లందుపర్తి సత్యనారాయణ అధ్యక్షన శనివారం నాడు జరిగినది. ఈ మహాసభలో నరసింహమూర్తి మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వము ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తున్న మంచి ప్రభుత్వాన్ని ప్రచారం చేసుకుంటుందని

వార్త‌లు

ముద్దాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో 2024-25 ఖరీఫ్ సీజన్ కు గాను ఏర్పాటు చేసిన “ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని” రైతులతో కలిసి తణుకు శాసన సభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల పేరుతో అన్నదాతలను వైసీపీ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని, ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. గతంలో ధాన్యం అమ్మిన సొమ్మును 6 నెలలు దాటిపోయినా కూడా రైతులు ఖాతాల్లో జమ

వార్త‌లు

సంక్రాంతికి గుంతలు లేని రోడ్లు

తణుకు నియోజకవర్గంలో గుంత‌ల ర‌హిత రోడ్ల‌ను నిర్మిస్తామ‌ని తణుకు శాసన సభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు మండలం దువ్వ గ్రామంలో మిషన్ పాట్ హోల్ ఫ్రీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మిషన్ పాట్ హోల్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో తణుకు నియోజకవర్గంలో దాదాపు 13 వర్కులకు గాను రూ. 2 కోట్ల రూపాయల వ్యయంతో అన్ని గ్రామాలలో రిపేర్లు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. దానిలో భాగంగా తణుకు మండలం దువ్వ గ్రామంలో రూ. 10 లక్షల రూపాయల

వార్త‌లు

అగ్నిప్రమాద బాధితులకు ప్రభుత్వ నష్టపరిహారం

తూర్పుగోదావరి జిల్లా, ఉండ్రాజవరం తేదీ:30.10.2024ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో బాణాసంచా తయారీ కేంద్రం సమీపంలో పిడుగు పాటు ధాటికి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన పై స్పందించిన రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్ర ప్రభుత్వము ద్వారా బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలియ చేశారు మృతుల కుటుంబాలకు ఒకొక్కరికి 5 లక్షలు పరిహారం ప్రకటించారు. మృతులు

వార్త‌లు

పిడుగుపాటే వారికి శాపం అయింది

అందరి జీవితాల్లో వెలుగులు చిమ్మే దీపావళి పండుగ వారి జీవితాలలో నిండు అమావాస్యను మిగిల్చింది. తూర్పుగోదావరి జిల్లా, ఉండ్రాజవరం మండలం,  సూర్యారావుపాలెం, కాల్దారి రహదారి ప్రక్కన కొబ్బరి చెట్టుపై పిడుగు పాటుకు బుధవారం ఆ ప్రాంతంలో ఉన్న దీపావళి బాణాసంచా తయారీ కేంద్రం పూర్తిగా దగ్ధమై పోగా, ఇద్దరు మహిళలు మృతి చెందారు, ఇద్దరిలో ఒకరు యజమాని భార్య కావడం ఒక విషాదమైతే,  ఐదుగురికి తీవ్ర గాయాలు, పలువురు పాక్షికంగా క్షతగాత్రులైనట్లు   ప్రాథమిక సమాచారం.  సాయంత్రం ఐదు గంటల

వార్త‌లు

ట్రూ అప్ చార్జీల భారాన్ని ప్రజలపై మోపరాదు

ట్రూ అప్ పేరుతో ప్రజలపై వేసిన 6072కోట్ల కరెంట్ బారాన్ని కూటమి ప్రభుత్వం ఉపసంహారించు కోవాలని CPM పట్టణ కార్యదర్శి పీవీ. ప్రతాప్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక వై జంక్షన్ వద్ద ఉన్న విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా మరియు విద్యుత్ పెంపుదల ప్రతులను దగ్ధం చేయడం CPM ఆధ్వర్యంలో జరిగింది. ట్రూ అప్, ఇందన సర్దుబాటు పేరుతో ప్రజలు పై బారాలు వేయడం ఆపాలని, కూటమి హామీలు మేరకు గత ప్రభుత్వం పెంచిన బారాలు

Scroll to Top