నిడదవోలు గవర్నమెంట్ ఉన్నత పాఠశాల యందు మంగళవారం ఉదయం నిడదవోలు మండలంలోని అంగన్వాడి కార్యకర్తలకు 120 రోజుల సర్టిఫికెట్ కోర్స్ జ్ఞానజ్యోతి మొదటి విడత ఆరు రోజుల శిక్షణా కార్యక్రమం విద్యాశాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖల సంయుక్త నిర్వహణలో పూర్వ, బాల్య, సంరక్షణ విద్య, పునాది, అభ్యసన, బోధన లక్ష్యంగా ప్రారంభించినట్లు మండల విద్యాశాఖ అధికారి తెలిపారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మండల తహసిల్దార్ నాగరాజు నాయక్ మాట్లాడుతూ మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలలో పునాది అభ్యసన మెరుగుపరచడానికి ఈ శిక్షణ కార్యక్రమం ఎంతగానో అంగన్వాడీలకు ఉపయోగపడుతుందని అన్నారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి లక్ష్మీనారాయణ, నిడదవోలు మున్సిపాలిటీ డి.ఈ. ఐసిడిఎస్ సూపర్వైజర్స్ పి.నలిని యు.పద్మ పాల్గొని మాట్లాడుతూ పిల్లలలో నైతిక శారీరక మానసిక భావోద్వేగ అభివృద్ధి పెంపొందించాలని అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. అదేవిధంగా ఈ శిక్షణా కార్యక్రమంలో అంగన్వాడీలలో మరింత గుణాత్మక విద్యాభివృద్ధికి దోహదం చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమ కోర్స్ డైరెక్టర్లు పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు ఎల్. సత్యనారాయణ, ఎం.ఈ.ఓ. కేఎన్వి గణేష్, పి.గురుమూర్తి రిసోర్స్ పర్సన్స్ రాములు, ఆరిఫా బేగం, లోధర్ తామస్, సి.ఆర్.పి లు రాజేంద్రప్రసాద్, పుష్ప వల్లిశ్వరి తదితరులు పాల్గొన్నారు.
