అందరికీ ఆరోగ్యంతోనే అభివృద్ధి సాధ్యం – రూ 1 కోటి 67 లక్షలు విలువ కల 27 మినీ ట్రాక్టర్లు పంపిణీ.

మంగళవారం స్థానిక రిలయన్స్ పెట్రోల్ బంకు వద్ద ఉన్న పరిణయ కళ్యాణ మండపంలో జరిగిన స్వచ్ఛ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో 1 కోటి 67 లక్షలు విలువగల మినీ ట్రాక్టర్లను పంచాయతీలకు ప్రభుత్వ విఫ్, శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, మంత్రి నిమ్మల రామానాయుడు సంయుక్తంగా పంపిణీ చేశారు. మంత్రి వర్యులు, ప్రభుత్వ విఫ్ ఇరువురు ట్రాక్టర్లును నడిపారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ గత టిడిపి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెత్తతో సంపద సృష్టించారనీ అన్నారు.గత ప్రభుత్వంలో సంపద కేంద్రాలను మూసివేసి రాష్ట్రాన్ని 45 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చారని,గ్రామ పంచాయతీలకు నిధులు లేక అభివృద్ధి లేక గ్రామ పంచాయతీ సర్పంచులు బిచ్చము ఎత్తి తమ నిరసనలు తెలియజేశారనీ అన్నారు.గత ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ లో నిల్వ ఉన్న 2092 కోట్లను దారి మళ్ళించారని అన్నారు.చెత్త పై పన్ను వేసిన చెత్త పాలన గత ప్రభుత్వానిది అని ప్రజలు తిరస్కరించి ఎన్డీఏ ప్రభుత్వాన్నికి అఖండ మెజారిటీనీ ఇచ్చి ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టరు నిమ్మల రామానాయుడు అన్నారు. ప్రభుత్వ విఫ్, శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ భాగంగా రాష్ట్రంలో పురపాలక సంఘాలకు, గ్రామ పంచాయతీలకు శానిటేషన్ కు సంబంధించి ట్రాక్టర్లు, వివిధ పరికరాలు పంపిణీ చేయుట చాలా ఆనందదాయకం అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మంత్రివర్యులు చేతుల మీద ఈరోజు 27 ట్రాక్టర్లు పంపిణీ చేయడం శుభపరిణామం అన్నారు.రానున్నకాలంలో మరిన్ని ట్రాక్టర్లు, శానిటేషన్ పరికరాలు అందించి ఆరోగ్యకరమైన పట్టణాలు, గ్రామాలుగా తీర్చిదిద్దడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విఫ్, శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో ఖతీబ్ కౌసర్ భానో,జిల్లా పంచాయతీ శాఖ అధికారి బి.అరుణశ్రీ,వివిధ శాఖల అధికారులు, నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్చి వలవల బాబ్జి, నియోజవర్గ బిజెపి ఇన్చార్చి ఈతకోట తాతాజీ. ఐషర్ కంపెనీ డీలర్ కూచిపూడి వినోద్, వివిధ గ్రామాల సర్పంచులు,టిడిపి,జనసేన, బిజెపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link